Madhya Pradesh: పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు.. మెజారిటీ స్థానాలు కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh Janpad Panchayat Polls, BJP Big Win: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కమలం వికసించింది. జన్ పద్ పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. అధికార పార్టీకి ఇది భారీ విజయం. 2023 ఎన్నికలకు ముందు బీజేపీ ఈ విజయం సాధించడం పట్ల శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఫుల్ ఖుష్ అవుతోంది. మధ్యప్రదేశ్ లోన 312 జన్ పద్ పంచాయతీలలో 226 స్థానాల్లో బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలుపొందారని ఆ పార్టీ ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ తాము 167 జన్ పద్ పంచాయతీల్లో గెలుపొందినట్లు ప్రకటించారు.
పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగవు..దీంతో ఇరు పార్టీలు పోటాపోటీగా గెలిచిన అభ్యర్థులు తమ వారే అంటూ ప్రకటించుకోవడంతో ఎవరెన్ని పంచాయతీలు గెలుపొందారనే విషయంపై మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. మందసౌర్ జిల్లాలోని గరోత్ జనపద్ పంచాయతీ ఫలితం ఒక్కటే కోర్టు స్టే కారణంగా ప్రకటించలేదు. రెండు విడుతలుగా 143 జన్ పద్ పంచాయతీ మొదటి విడతగా.. 170 జన్ పద్ పంచాయతీలకు రెండో విడతగా ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 143 జన్పద్ పంచాయతీ బీజేపీ 102 స్థానాలను కైవసం చేసుకోగా.. 29 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. గోండ్వానా గణతంత్ర పార్టీ అభ్యర్థులు 5 పంచాయతీల్లో గెలుపొందగా.. స్వతంత్రులు 6 పంచాయతీల్లో విజయం సాధించారు. ఇక 170 పంచాయతీల్లో 124 పంచాయతీలను బీజేపీ కైవసం చేసుకుంది.
Also Read
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
- India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
Read Also: fighter Jet Crash: రాజస్థాన్లో కూలిన మిగ్-21 ఫైటర్ జెట్.. ఇద్దరు పైలట్లు మృతి
బీజేపీ 226 జన్ పద్ పంచాయతీల్లో గెలుపొందడం చారిత్రాత్మక విజయం అని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి అద్భుతమైన విజయాన్ని సాధించలేదని.. కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 167 పంచాయతీలను గెలుచుకుంది. అయితే అధికార పార్టీ ధనబలం, పోలీసులను ఉపయోగించినా.. ప్రజలు ఒత్తడికి లొంగకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు నిలిచారని పార్టీ కీలక నేత కమల్ నాథ్ అన్నారు. ఇదిలా ఉంటే కమల్ నాథ్ సొంత ప్రాంతం చింద్వారాలోని 11 జన్ పద్ పంచాయతీల్లో 6 స్థానాల్లో బీజేపీ గెలుపొందడం విశేషం.
తాజావార్తలు
-
Tragedy: హైదరాబాద్లో భారీ వర్షానికి ఇద్దరు బలి..
-
India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
-
Zodiac Signs : రేపు ఈ 5 రాశుల వారికి ధనయోగం.. సౌభాగ్య, ఆయుష్మాన్ యోగాల అద్భుత కలయిక
-
Dhruva Yoga: జూన్ 17న ధ్రువ యోగం.. ఈ రాశుల వారికి జాక్పాట్..
-
Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!