Madhya Pradesh: పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు.. మెజారిటీ స్థానాలు కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh Janpad Panchayat Polls, BJP Big Win: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కమలం వికసించింది. జన్ పద్ పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. అధికార పార్టీకి ఇది భారీ విజయం. 2023 ఎన్నికలకు ముందు బీజేపీ ఈ విజయం సాధించడం పట్ల శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఫుల్ ఖుష్ అవుతోంది. మధ్యప్రదేశ్ లోన 312 జన్ పద్ పంచాయతీలలో 226 స్థానాల్లో బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలుపొందారని ఆ పార్టీ ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ తాము 167 జన్ పద్ పంచాయతీల్లో గెలుపొందినట్లు ప్రకటించారు.
పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగవు..దీంతో ఇరు పార్టీలు పోటాపోటీగా గెలిచిన అభ్యర్థులు తమ వారే అంటూ ప్రకటించుకోవడంతో ఎవరెన్ని పంచాయతీలు గెలుపొందారనే విషయంపై మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. మందసౌర్ జిల్లాలోని గరోత్ జనపద్ పంచాయతీ ఫలితం ఒక్కటే కోర్టు స్టే కారణంగా ప్రకటించలేదు. రెండు విడుతలుగా 143 జన్ పద్ పంచాయతీ మొదటి విడతగా.. 170 జన్ పద్ పంచాయతీలకు రెండో విడతగా ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 143 జన్పద్ పంచాయతీ బీజేపీ 102 స్థానాలను కైవసం చేసుకోగా.. 29 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. గోండ్వానా గణతంత్ర పార్టీ అభ్యర్థులు 5 పంచాయతీల్లో గెలుపొందగా.. స్వతంత్రులు 6 పంచాయతీల్లో విజయం సాధించారు. ఇక 170 పంచాయతీల్లో 124 పంచాయతీలను బీజేపీ కైవసం చేసుకుంది.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
Read Also: fighter Jet Crash: రాజస్థాన్లో కూలిన మిగ్-21 ఫైటర్ జెట్.. ఇద్దరు పైలట్లు మృతి
బీజేపీ 226 జన్ పద్ పంచాయతీల్లో గెలుపొందడం చారిత్రాత్మక విజయం అని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి అద్భుతమైన విజయాన్ని సాధించలేదని.. కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 167 పంచాయతీలను గెలుచుకుంది. అయితే అధికార పార్టీ ధనబలం, పోలీసులను ఉపయోగించినా.. ప్రజలు ఒత్తడికి లొంగకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు నిలిచారని పార్టీ కీలక నేత కమల్ నాథ్ అన్నారు. ఇదిలా ఉంటే కమల్ నాథ్ సొంత ప్రాంతం చింద్వారాలోని 11 జన్ పద్ పంచాయతీల్లో 6 స్థానాల్లో బీజేపీ గెలుపొందడం విశేషం.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!