Shocking Incident: ప్రియురాలి ఇంటి ఓనర్ పై ప్రియుడు దాడి.. నగదు, బంగారం దోపిడి
- బుధేశ్వర్ ప్రాంతంలోని ఆదర్శ్ విహార్ కాలనీలో ఘటన
- ఇంటి యజమానిపై దాడి చేసిన నిందితులు
- భారీ మొత్తంలో నగదు, బంగారం దోపిడి
- కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టిన పోలీసులు
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో నగరంలో అద్దెకు నివసించిన యువతి ప్రియుడు తన సహచరులతో కలిసి ఇంటి యజమానిపై దాడి చేసి భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో బాధితుడిని జల్ నిగమ్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్న పింటు శర్మను పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటన పారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధేశ్వర్ ప్రాంతంలోని ఆదర్శ్ విహార్ కాలనీలో జరిగింది. పింటు శర్మ తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నలుగురు యువకులు తలుపు తట్టారు. ఆయన చిన్న గేటు తెరవగానే, వారు బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డారు. నిందితుల చేతుల్లో పిస్టల్స్ ఉండగా, పింటు శర్మ తల వెనుక భాగంపై తీవ్రంగా దాడి చేయడంతో అతనికి తీవ్ర రక్తస్రావం జరిగింది.
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
తమ మాట వినకపోతే కాల్చివేస్తామని బెదిరించిన నిందితులు అల్మారా తాళాలను లాక్కొని తెరిచారు. అందులో ఉన్న రూ.5 లక్షల నగదు, సుమారు 1.5 తులాల బంగారు గొలుసు, 7 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. దోపిడీ అనంతరం ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ చెల్లాచెదురుగా పడేసి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
పింటు శర్మ ఇచ్చిన ఫిర్యాదులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. శకుంతల విశ్వవిద్యాలయంలో చదువుతున్న భారతి అనే యువతి తన ఇంటి రెండో అంతస్తులో అద్దెకు నివసించేదని తెలిపారు. అద్దె చెల్లించకపోవడంతో ఇటీవల ఆమెతో వివాదం ఏర్పడిందని, ఐదు నుంచి ఆరు రోజుల క్రితం గదిని ఖాళీ చేయించామని చెప్పారు. అద్దె చెల్లించిన తరువాత తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆమెకు చెందిన రిఫ్రిజిరేటర్ను ఇంట్లోనే ఉంచినట్లు వివరించారు.
ఈ దాడికి భారతి ప్రియుడు అనుజ్ ప్రధాన నిందితుడని పింటు శర్మ ఆరోపించాడు. అనుజ్ తరచూ తన ఇంటికి వచ్చేవాడని, అందువల్ల అతడిని స్పష్టంగా గుర్తించగలిగానని పేర్కొన్నాడు. మరో నిందితుడిగా మాలిక్ను కూడా గుర్తించినట్లు తెలిపాడు. ఘటన సమయంలో ఇద్దరు యువకులు ఇంటి బయట కాపలా కాస్తూ ఉన్నారని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!