Congress: దిగజారుడు రాజకీయాలు.. కేజ్రీవాల్ అరెస్ట్పై స్పందించిన కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: అరవింద్ కేజ్రీవాల్ని ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఈ రోజు అరెస్ట్ చేసింది. అరెస్ట్ నుంచి రక్షణ ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్న కొన్ని గంటల తర్వాత ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసం సోదాలు నిర్వహించి, అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్పై ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమిలోని పలు పార్టీలు బీజేపీపై తీవ్రస్థాయిలో దాడి చేస్తున్నారు.
Read Also: Delhi Liquor Policy Case: లిక్కర్ పాలసీ కేసులో ఎప్పుడు ఏం జరిగింది..? ఎవరెవరు అరెస్ట్..?
Also Read
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ ఎక్స్ వేదికగా కేజ్రీవాల్ అరెస్టును ఖండించారు. ‘‘ లోక్సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్ని లక్ష్యంగా చేసుకోవడం పూర్తిగా తప్పు, రాజ్యాంగ విరుద్ధం’’ అని అన్నారు. ఈ విధంగా దిగజారుడు రాజకీయాలు చేయడం ప్రధాని నరేంద్రమోడీకి, ఆయన ప్రభుత్వానికి తగదని ఆమె అన్నారు. ఎన్నికల సమరంలో మీ విమర్శకులతో పోరాడండి, వారిని ధైర్యంగా ఎదుర్కొండి, వారి విధానాలను, పనితీరుపై దాడి చేయండి, ఇది ప్రజాస్వామ్యం అవుతుంది, కానీ ఈ విధంగా ఒకరి రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి దేశంలోని అన్ని సంస్థల శక్తిని ఉపయోగించి ఒత్తిడి చేయడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని ఆమె అన్నారు.
మరో కాంగ్రెస్ నేత కార్తి చిదంబరం మాట్లాడుతూ..ఇది పూర్తి ఫాసిజంగా అభివర్ణించారు. ఇద్దరు సిట్టింగ్ సీఎంలను లోక్సభ ఎన్నికల ముందు అరెస్ట్ చేశారు. చట్టాన్ని ఆయుధంగా చేస్తున్నారని, ప్రజలు దేశాన్ని రక్షించుకుంటారా..? అని ట్వీట్ చేశారు. ఎన్సీపీ(శరద్ పవార్).. కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టింది. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిపక్షాలను, ఇండియా కూటమిలోని నేతల్ని కేంద్ర ఏజెన్సీలు టార్గెట్ చేస్తున్నాయని ఎన్సీపీ ప్రతినిధి క్లైడ్ క్రాస్టో చెప్పారు.
తాజావార్తలు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!