PUBG love story: చికెన్ బిర్యానీ వదిలేసింది.. తులసి పూజ స్టార్ట్ చేసిన పాకిస్తాన్ మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PUBG love story: పాకిస్తాన్ మహిళ సీమా హైదర్(30), నోయిడా వ్యక్తి సచిన్ మీనాల(25) ప్రేమ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పబ్జీ గేమ్ ఇద్దరు ప్రేమలో పడేందుకు కారణం అయింది. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో పబ్జీ గేమ్ ఆడుతూ ఇద్దరు పరిచయం అయ్యారు. అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలు ఉన్న సీమా హైదర్, సచిన్ మీనాతో ప్రేమలో పడింది. ఇద్దరు తొలిసారిగా నేపాల్ లో కలుసుకుని పెళ్లి చేసుకున్నారు. తర్వాత సీమా పాకిస్తాన్ వెళ్లి, తన నలుగురు పిల్లలతో కలిసి మరోసారి నేపాల్ వచ్చి అక్కడ నుంచి బస్సు ద్వారా నోయిడాకు చేరుకుంది.

Also Read
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
- Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
ఇదిలా అక్రమంగా దేశంలోకి ప్రవేశించడం, ఇతర దేశాలకు చెందిన వ్యక్తి ఆశ్రయం కల్పించడం వంటి కేసులో సీమా, సచిన్ ఇద్దరు అరెస్టయ్యారు. ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు. ఇదిలా ఉంటే సీమా తన భర్త హిందువు, భారతీయుడని, ఇప్పుడు నేడు కూడా హిందువు, భారతీయులరాలినే అని ప్రకటించింది. తాను ఇకపై పాకిస్తాన్ వేళ్లేది లేదని, ఇకపై భారతదేశమే నా దేశం అని ప్రకటించింది.
Read Also: Super Scheme : నెలకు రూ.200 పొదుపు చేస్తే.. సంవత్సరానికి రూ..72 వేలు పొందవచ్చు..
ఇదిలా ఉంటే తాను ఇకపై చికెన్ బిర్యానీ విడిచిపెట్టినట్లు తెలిపింది. హిందూ మతంలోకి మారి తులసి పూజ, దేవీదేవతల పూజను ప్రారంభించారు సీమా హైదర్. నమస్కారంతో పెద్దలను పలకరించడంతో పాటు, పాదాలను తాకి ఆశీర్వాదాన్ని కోరుతున్నారు. సీమ తనకు ఇష్టమైన చికెన్ బిర్యానీ, మాంసం మరియు చేపలను కూడా వదులుకుంది. భారతీయ సంస్కృతిని హృదయపూర్వకంగా స్వీరించేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె తన మెడలో రాధే రాధే పట్టిని ధరిస్తున్నారు. తాను ప్రేమ కోసమే ఇదంతా చేస్తున్నట్లు చెబుతున్నారు.

సీమా హైదర్ పాకిస్తాన్ లోని తన ఇళ్లును రూ. 15 లక్షల పాకిస్తాన్ రూపాయలకు అమ్మేసి, ఏడేళ్లలోపు ఉన్న తన నలుగురి పిల్లలతో కలిసి దుబాయ్, నేపాల్ మీదుగా ఇండియాకు చేరుకుంది. భారత పౌరసత్వం పత్రాలకు సంబంధించి ఓ లాయర్ ని సీమా, సచిన్ కలుసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవలే వీరిద్దరు బెయిల్ పై విడుదలై కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మరోవైపు సీమా అసలు భర్త గులాం హైదర్ తన భార్యాపిల్లలను కలిసేందుకు భారత ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నాడు. తాను పాకిస్తాన్ వెళ్లనని, ఒక వేళ వెళ్తే తనను చంపేస్తారని సీమా చెబుతోంది.
తాజావార్తలు
-
Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!