PUBG love story: చికెన్ బిర్యానీ వదిలేసింది.. తులసి పూజ స్టార్ట్ చేసిన పాకిస్తాన్ మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PUBG love story: పాకిస్తాన్ మహిళ సీమా హైదర్(30), నోయిడా వ్యక్తి సచిన్ మీనాల(25) ప్రేమ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పబ్జీ గేమ్ ఇద్దరు ప్రేమలో పడేందుకు కారణం అయింది. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో పబ్జీ గేమ్ ఆడుతూ ఇద్దరు పరిచయం అయ్యారు. అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలు ఉన్న సీమా హైదర్, సచిన్ మీనాతో ప్రేమలో పడింది. ఇద్దరు తొలిసారిగా నేపాల్ లో కలుసుకుని పెళ్లి చేసుకున్నారు. తర్వాత సీమా పాకిస్తాన్ వెళ్లి, తన నలుగురు పిల్లలతో కలిసి మరోసారి నేపాల్ వచ్చి అక్కడ నుంచి బస్సు ద్వారా నోయిడాకు చేరుకుంది.

Also Read
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
- Supreme Court: ‘సర్’లో పేరు లేకపోతే పౌరసత్వం లేనట్టేనా.. సంక్షేమ పథకాలు నిలిపేస్తారా? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఇదిలా అక్రమంగా దేశంలోకి ప్రవేశించడం, ఇతర దేశాలకు చెందిన వ్యక్తి ఆశ్రయం కల్పించడం వంటి కేసులో సీమా, సచిన్ ఇద్దరు అరెస్టయ్యారు. ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు. ఇదిలా ఉంటే సీమా తన భర్త హిందువు, భారతీయుడని, ఇప్పుడు నేడు కూడా హిందువు, భారతీయులరాలినే అని ప్రకటించింది. తాను ఇకపై పాకిస్తాన్ వేళ్లేది లేదని, ఇకపై భారతదేశమే నా దేశం అని ప్రకటించింది.
Read Also: Super Scheme : నెలకు రూ.200 పొదుపు చేస్తే.. సంవత్సరానికి రూ..72 వేలు పొందవచ్చు..
ఇదిలా ఉంటే తాను ఇకపై చికెన్ బిర్యానీ విడిచిపెట్టినట్లు తెలిపింది. హిందూ మతంలోకి మారి తులసి పూజ, దేవీదేవతల పూజను ప్రారంభించారు సీమా హైదర్. నమస్కారంతో పెద్దలను పలకరించడంతో పాటు, పాదాలను తాకి ఆశీర్వాదాన్ని కోరుతున్నారు. సీమ తనకు ఇష్టమైన చికెన్ బిర్యానీ, మాంసం మరియు చేపలను కూడా వదులుకుంది. భారతీయ సంస్కృతిని హృదయపూర్వకంగా స్వీరించేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె తన మెడలో రాధే రాధే పట్టిని ధరిస్తున్నారు. తాను ప్రేమ కోసమే ఇదంతా చేస్తున్నట్లు చెబుతున్నారు.

సీమా హైదర్ పాకిస్తాన్ లోని తన ఇళ్లును రూ. 15 లక్షల పాకిస్తాన్ రూపాయలకు అమ్మేసి, ఏడేళ్లలోపు ఉన్న తన నలుగురి పిల్లలతో కలిసి దుబాయ్, నేపాల్ మీదుగా ఇండియాకు చేరుకుంది. భారత పౌరసత్వం పత్రాలకు సంబంధించి ఓ లాయర్ ని సీమా, సచిన్ కలుసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవలే వీరిద్దరు బెయిల్ పై విడుదలై కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మరోవైపు సీమా అసలు భర్త గులాం హైదర్ తన భార్యాపిల్లలను కలిసేందుకు భారత ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నాడు. తాను పాకిస్తాన్ వెళ్లనని, ఒక వేళ వెళ్తే తనను చంపేస్తారని సీమా చెబుతోంది.
తాజావార్తలు
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?