Lok Sabha Elections 2024: “నితీష్ నుంచి అప్నాదళ్ వరకు”.. ఇండియా కూటమిని వదిలివెళ్లిన పార్టీలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections 2024: బీజేపీని, ప్రధాని నరేంద్రమోడీని మళ్లీ అధికారంలోకి రానీయకుండా అడ్డుకుంటాని చెబుతూ ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే, కొన్ని రోజులకు ఈ కూటమిలోని ఒక్కో పార్టీ వెళ్లిపోయి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరాయి. ఇండియా కూటమికి ఆధ్యుడిగా భావించే బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎన్డీయే కూటమిలో చేరి బిగ్ షాక్ ఇచ్చారు. మరోవైపు తృణమూల్ సుప్రిమో, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కూటమికి అంటీముట్టనట్లు ఉంటున్నారు.
Read Also: Vey Dharuvey OTT: ఓటీటీలోకి రాబోతున్న మాస్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Also Read
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్ను సందర్శించే అవకాశం
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్డ్రా..
ఇండియా కూటమిని వదిలిన పార్టీలు ఇవే:
ఆర్ఎల్డీ:
దేశంలో అధికారానికి అత్యంత కీలకమైన ఉత్తర ప్రదేశ్లో, ముఖ్యంగా రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో ప్రభావం చూపించే జయంత్ చౌదరికి చెందిన ‘రాష్ట్రీయ లోక్ దళ్’ అఖిలేష్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)తో పొత్తును ఉపసంహరించుకుంది. ప్రస్తుతం బీజేపీతో జతకట్టింది.
అప్నాదళ్ (కామెరవాడి): కొద్ది రోజుల క్రితం సమాజ్వాదీ పార్టీతో పొత్తులో భాగమైన పల్లవి పటేల్, సంకీర్ణాన్ని విడిచిపెట్టి, రాబోయే లోక్సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్లో అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నారు.
వీబీఏ: ప్రకాష్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడి (VBA) మహా వికాస్ అఘాడిని విడిచిపెట్టింది. మహారాష్ట్రలోని కాంగ్రెస్-శివసేన(యూబీటీ)-ఎన్సీపీ(శరద్ పవార్) నేతృత్వంలోని కూటమిలో సీట్ల షేరింగ్లో విబేధాలు రావడంతో ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చింది.
ఎన్సీపీ (అజిత్ పవార్): మహారాష్ట్రలో అత్యంత కీలకమైన ఎన్సీపీ పార్టీలో లుకలుకలు ఆ పార్టీని రెండుగా చీల్చాయి. అయితే, శరద్ పవార్ని కాదని అజిత్ పవార్ మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన(షిండే) ప్రభుత్వంలో చేరారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేల సపోర్టు కూడా అజిత్ పవార్కే ఉంది. ప్రస్తుతం ఎన్సీపీ(అజిత్ పవార్) ఎన్డీయేలో ఉంది.
హెచ్ఏఎం: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామ్ మోర్చా(సెక్యులర్) చీఫ్ జీతన్ రామ్ మాంఝీ గతేడాది ఎన్డీయే కూటమిలో చేరారు. అంతకుముందు కొంతకాలం ఈ పార్టీ ఇండియా కూటమిలో భాగంగా ఉంది.
తాజావార్తలు
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
-
“ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..