Mamata Banerjee: కోల్కతా హాస్పిటల్ దాడి బీజేపీ, లెఫ్ట్ పార్టీల పనే..
- కోల్కతా ఆస్పత్రి విధ్వంసం వెనక బీజేపీ-లెఫ్ట్ పార్టీలు..
- సాక్ష్యాలు తుడిచిపెట్టేందుకే దాడి..
- వైద్యురాలి హత్యాచారం కేసుపై మమతా బెనర్జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: కోల్కతా వైద్యురాలి అత్యాచారం-హత్య ఘటన ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపలనకు కారణమైంది. మమతా బెనర్జీ సర్కారుపై బీజేపీ, లెఫ్ట్ పార్టీలు విరుచుకుపడుతున్నాయి. గత వారం కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల పీజీ ట్రైనీ మహిళా డాక్టర్పై అత్యంత పాశవికంగా అత్యాచారం జరిగింది. మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో ఆమెపై సంజయ్ రాయ్ అనే వ్యక్తిని దారుణానికి ఒడిగట్టానే ఆరోపణల్ని ఎదుర్కొంటున్నాడు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా వైద్యులు రోడ్డెక్కారు. బాధితురాలికి మద్దతుగా ధర్నాలు, నిరసనలు తెలిపారు. ఇప్పటికే ఈ కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది.
ఇదిలా ఉంటే, గురువారం వైద్యులు నిరసన తెలుపుతున్న సందర్భంలో కొందరు దుండగులు ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిపై దాడి చేశారు. ఈ ఘటనలో సీపీఎం, బీజేపీ దాని మిత్రపక్షాల ప్రమేయం ఉందని సీఎం మమతా బెనర్జీ ఈ రోజు అన్నారు. ఈ రోజు బాధిత వైద్యురాలికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. నిందితుడిని ఉరితీయాలని ఆమె డిమాండ్ చేశారు. అత్యాచారం, హత్య వెనక ఉన్న నిజాన్ని మరుగునపరిచేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.
Also Read
- Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
- INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
- Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
Read Also: Satyakumar: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన ఆరోగ్య సేవలను అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ..
నిజాలు బయటకు రావాలని కోరుకుంటున్నామని, కానీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ నిజాన్ని దాచి పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ చర్యల్ని ఖండిస్తున్నామని, దోషుల్ని ఖఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి విధ్వంసం వెనక బీజేపీ, సీపీఎంలు ఉన్నాయని, సాక్ష్యాలు ధ్వంసం చేయడానికి ఆస్పత్రిపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. బెంగాల్లో అశాంతి సృష్టించేందుకు రెండు పార్టీలు ఒకటయ్యాయని విమర్శించారు. చాలా వీడియోల్లో సీపీఎం, బీజేపీ జెండాలు ఉన్నాయని చెప్పారు.
ఇదిలా ఉంటే, మమతా బెనర్జీపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. ఆర్జీ కర్ ఆస్పత్రి దాడి వెనక టీఎంసీ గుండాలు ఉన్నారని, పోలీసులు వారికి సురక్షితమైన మార్గాన్ని అందించి పారిపోయాలా చేశారని బీజేపీ నేత సువేందు అధికారి ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఈ విధ్వంసానికి పాల్పడిన వారిలో 25 మంది పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!