Mamata Banerjee: కోల్కతా హాస్పిటల్ దాడి బీజేపీ, లెఫ్ట్ పార్టీల పనే..
- కోల్కతా ఆస్పత్రి విధ్వంసం వెనక బీజేపీ-లెఫ్ట్ పార్టీలు..
- సాక్ష్యాలు తుడిచిపెట్టేందుకే దాడి..
- వైద్యురాలి హత్యాచారం కేసుపై మమతా బెనర్జీ..
Mamata Banerjee: కోల్కతా వైద్యురాలి అత్యాచారం-హత్య ఘటన ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపలనకు కారణమైంది. మమతా బెనర్జీ సర్కారుపై బీజేపీ, లెఫ్ట్ పార్టీలు విరుచుకుపడుతున్నాయి. గత వారం కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల పీజీ ట్రైనీ మహిళా డాక్టర్పై అత్యంత పాశవికంగా అత్యాచారం జరిగింది. మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో ఆమెపై సంజయ్ రాయ్ అనే వ్యక్తిని దారుణానికి ఒడిగట్టానే ఆరోపణల్ని ఎదుర్కొంటున్నాడు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా వైద్యులు రోడ్డెక్కారు. బాధితురాలికి మద్దతుగా ధర్నాలు, నిరసనలు తెలిపారు. ఇప్పటికే ఈ కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది.
ఇదిలా ఉంటే, గురువారం వైద్యులు నిరసన తెలుపుతున్న సందర్భంలో కొందరు దుండగులు ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిపై దాడి చేశారు. ఈ ఘటనలో సీపీఎం, బీజేపీ దాని మిత్రపక్షాల ప్రమేయం ఉందని సీఎం మమతా బెనర్జీ ఈ రోజు అన్నారు. ఈ రోజు బాధిత వైద్యురాలికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. నిందితుడిని ఉరితీయాలని ఆమె డిమాండ్ చేశారు. అత్యాచారం, హత్య వెనక ఉన్న నిజాన్ని మరుగునపరిచేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Satyakumar: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన ఆరోగ్య సేవలను అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ..
నిజాలు బయటకు రావాలని కోరుకుంటున్నామని, కానీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ నిజాన్ని దాచి పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ చర్యల్ని ఖండిస్తున్నామని, దోషుల్ని ఖఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి విధ్వంసం వెనక బీజేపీ, సీపీఎంలు ఉన్నాయని, సాక్ష్యాలు ధ్వంసం చేయడానికి ఆస్పత్రిపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. బెంగాల్లో అశాంతి సృష్టించేందుకు రెండు పార్టీలు ఒకటయ్యాయని విమర్శించారు. చాలా వీడియోల్లో సీపీఎం, బీజేపీ జెండాలు ఉన్నాయని చెప్పారు.
ఇదిలా ఉంటే, మమతా బెనర్జీపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. ఆర్జీ కర్ ఆస్పత్రి దాడి వెనక టీఎంసీ గుండాలు ఉన్నారని, పోలీసులు వారికి సురక్షితమైన మార్గాన్ని అందించి పారిపోయాలా చేశారని బీజేపీ నేత సువేందు అధికారి ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఈ విధ్వంసానికి పాల్పడిన వారిలో 25 మంది పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!