Maharashtra: సీఎం ఫడ్నవీస్ మీటింగ్కి ఏక్నాథ్ షిండే మళ్లీ గైర్హాజరు.. ప్రభుత్వంలో విబేధాలు..?
- మహారాష్ట్ర మహాయుతి సర్కార్లో విభేదాలు..
- సీఎం సమావేశానికి డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే గైర్హాజరు..
- ఫడ్నవీస్, షిండే మధ్య గొడవలు అంటూ పుకార్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్ర మహయుతి ప్రభుత్వంలో విభేదాలు కనిపిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వ్యవహార శైలి చూస్తే ఇది నిజమని తెలుస్తోంది. గతేడాది చివర్లో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన-షిండే, ఎన్సీపీ-అజిత్ పవార్ల కూటమి ఘన విజయం సాధించింది. అయితే, మరోసారి సీఎం పదవిని కోరుకున్న ఏక్నాథ్ షిండే ఆశ నెరవేరలేదు. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టారు.
Also Read
- GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
ఇదిలా ఉంటే, సోమవారం, తన గృహనిర్మాణ శాఖకు సంబంధించిన ప్రాజెక్టుతో సహా ముఖ్యమైన ప్రాజెక్టులను చర్చించడానికి ఫడ్నవీస్ పిలిచిన సమావేశానికి షిండే హాజరు కాలేదు. శివసేన నుండి సహాయ మంత్రి (MoS) యోగేష్ కదమ్ షిండే ప్రాతినిధ్యం వహించారు. గత వారం, షిండే కూడా క్యాబినెట్ సమావేశానికి గైర్హాజరయ్యారు. సీఎం, డిప్యూటీ సీఎం మధ్య సంబంధాలు బాగా లేవనే పుకార్లకు ఈ పరిణామాలు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే, శివసేన ఎంపీ నరేష్ మష్కే మాట్లాడుతూ, షిండే కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురైనందున ఆయన సమావేశానికి హాజరు కాలేదని అన్నారు.
అజిత్ పవార్ ఎన్సీపీ కూడా ఈ పరిణామాలపై నోరు విప్పలేదు. ‘‘ఆయన (షిండే) సమావేశానికి ఎందుకు రాలేదో మనకు ఎలా తెలుస్తుంది? సమావేశం జరిగి, ఆయన రాకపోతే, ఆయనను ఎందుకు రాలేదో అడగండి” అని ఎన్సీపీ నేత ఛగన్ భుజ్బాల్ అన్నారు. ఈ పరిణామాలపై ఉద్ధవ్ శివసేన విమర్శలు గుప్పించింది. షిండేకు బీజేపీ అంటే ఏమిటో ఇప్పుడిప్పుడే తెలుస్తోందంటూ ఆ వర్గం నేత అరవింద్ సావంత్ అన్నారు. ఉద్ధవ్ వర్గం నేత ప్రియాంకా చతుర్వేది మాట్లాడుతూ.. ఇద్దరి మధ్య గొడవ జరుగుతోందని అన్నారు.
తాజావార్తలు
-
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
-
Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
-
Chinmayi: డబ్బింగ్ రూమ్లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..