Tomato Flu: “టమోటో ఫ్లూ”పై భారత్ అప్రమత్తంగా ఉండాలి.. లాన్సెట్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lancet Warns About ‘Tomato Flu’ In India: ఇప్పటికే ఇండియా రకరకాల వైరస్ వ్యాధులతో బాధపడుతోంది. కోవిడ్ ఎలాగూ గత రెండున్నరేళ్ల నుంచి దేశంలోని ప్రజలకు సోకుతూనే ఉంది. తాజాగా మంకీపాక్స్ కేసులు కూడా ఇండియాలో నమోదు అయ్యాయి. దీంతో పాటు అక్కడక్కడ స్వైన్ ఫ్లూ వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో కొత్త వైరస్ వ్యాధి పట్ల భారతదేశం అప్రమత్తంగా ఉండాలని లాన్సెట్ రెసపిరేటరీ జర్నల్ తన నివేదికలో హెచ్చరించింది.
ఇండియాలో కొత్తగా ‘టామోటో ఫ్లూ’ వ్యాధి వెలుగులోకి వచ్చింది. పాదం, చేతులు, నోటి ప్రాంతాల్లో పెద్దగా ఎర్రని పొక్కులు రావడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్న పిల్లలే ఈ వ్యాధికి ప్రభావితం అవుతుంటారు. తాజాగా ఈ వ్యాధి గురించి లాన్సెట్ రెస్పిరేటరీ జర్నల్ వివరాలను వెల్లడించింది. టమోటో ఫ్లూ కేసులు మొదటగా కేరళలోని కొల్లంలో మే 6న నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 82 మంది పిల్లలకు ఈ వ్యాధి సోకింది. వ్యాధి సోకిన పిల్లలంతా 5 ఏళ్లలోపు వారే అని లాన్సెట్ వెల్లడించింది.
Also Read
- Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
Read Also: Himachal Pradesh: వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 13 మంది మృతి
ఇంటెస్టినల్ వైరస్ ( పేగులో ఉండే వైరస్)ల వల్ల టమోటో ఫ్లూ వస్తుంది. అయితే పెద్దవాళ్లలో ఈ వ్యాధి చాలా అరుదుగా కనిపిస్తుంది. ఎందుకంటే.. పెద్దవాళ్ల ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ గా ఉండటంతో ఈ వైరస్ ను ఎదుర్కొంటోంది. అయితే పిల్లలు మాత్రమే ఎక్కువగా ఈ టమోటో ఫ్లూ బారిన పడుతుంటారు. శరీరంపై ఎర్రగా.. పెద్దగా బొబ్బలు ఏర్పడతాయి. టమోటో సైజుకు పెరుగుతాయి. దీంతో ఈ ఇన్ఫెక్షన్ ను టమోటో ఫ్లూగా వ్యవహరిస్తుంటారు. చికెన్ గన్యా లాగే అధిక జ్వరం, శరీర నొప్పులు, కీళ్ల వాపు, అలసట ఈ వ్యాధి లక్షణాలు. కొంత మంది రోగుల్లో వికారం, వాంతులు, డయేరియా, జ్వరం, డీ హైడ్రేషన్ వంటి లక్షణాలు ఉంటాయి.
లాన్సెట్ ప్రకాం,.. కేరళలో అంచల్, ఆర్యంకావు, నెడువత్తూర్ ప్రాంతాలు ఈ వ్యాధికి ప్రభావితం అయ్యాయి. దీంతో ఈ ప్రాంతాల సరిహద్దుల్లో ఉన్న తమిళనాడు, కర్ణాటకల్లో కూడా అలర్ట్ ఏర్పడింది. ఒడిశాలో 26 మంది పిల్లలు ఈ వ్యాధి బారినపడినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇండియాలో కేరళ, తమిళనాడు, ఒడిశా ప్రాంతాల్లోనే ఈ వ్యాధి ప్రబలింది. ఇది సాధారణంగా స్వయం పరిమిత వ్యాధి. ఈ వ్యాధికి నిర్థిష్ట చికిత్సలేదు. లక్షణాలను బట్టి చికిత్స చేస్తారు. కొన్ని రోజుల్లో మన వ్యాధినిరోధక వ్యవస్థ వైరస్ ను శరీరం నుంచి తొలిగిస్తుంది.
తాజావార్తలు
-
Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
-
Family Vacation: యూరప్ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్కు బెస్ట్!
-
MP Uday Srinivas: ‘జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం’.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
-
TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
-
Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా ఘనత..
ట్రెండింగ్
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!