PM Modi: “ముస్లింలకు పూర్తి రిజర్వేషన్లు”.. లాలూ వ్యాఖ్యలపై పీఎం మోడీ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ముస్లిం రిజర్వేషన్లపై ఆర్జేడీ నేత, మాజీ బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముస్లింల పూర్తి రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించడంపై వివాదం మొదలైంది. పాట్నాలో మీడియాతో మాట్లాడిన లాలూ యాదవ్ రాజ్యాంగాన్ని రద్దు చేయడం ద్వారా రిజర్వేషన్లను తొలగించాలని అధికార బీజేపీ భావిస్తోందని ఆయన ఆరోపించారు. దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలనుకుంటున్నారని ఆర్జేడీ అధినేత అన్నారు.
Read Also: Pannun murder plot: ఖలిస్తాన్ పన్నూ హత్య కుట్రలో భారత్ దర్యాప్తుపై అమెరికా ఎదురుచూపు..
Also Read
- IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్లో నిరసనలు
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
లాలూ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలను మానలేదని, వారికి ఓటేస్తే మీరు శ్వాసించే హక్కును కూడా తీసుకుంటారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న మోడీ మాట్లాడుతూ.. దాణా కుంభకోణంలో నిందితుడు బెయిల్పై బయట ఉన్న నాయకుడు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని అంటున్నారని, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను లాక్కుని ముస్లింలకు ఇవ్వాలని అనుకుంటున్నారని ప్రధాని అన్నారు. ‘‘ కాంగ్రెస్ మౌనంగా ఉంది. కానీ ఈ రోజు దాని మిత్రపక్షాలలో ఒకటి ఇండియా కూటమి ఉద్దేశాలను ధ్రువీకరించింది. ముస్లింలకు ‘సంపూర్ణ’ రిజర్వేషన్లు కావాలని ఆయన అన్నారు. దీని అర్ధం ఏమిటి..?’’ అని ప్రశ్నించారు. తాను జీవించి ఉన్నంత కాలం ‘‘బూటకపు సెక్యులరిజం’’ పేరుతో భారతదేశ గుర్తింపును చెరిపేయడానికి ఎవరినీ అనుమతించనని అన్నారు.
బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మాట్లాడుతూ.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాజ్యాంగ మౌలిక స్వరూపంలో మార్పులు చేయడం ద్వారా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఆర్జేడీ చీఫ్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ఆయన వ్యాఖ్యల్లో పూర్తిగా రిజర్వేషన్లు అనేది చాలా తీవ్రమైందని, వారు ఎస్టీ/ఎస్టీ, ఓబీసీ వాటా నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుకుంటున్నారని అన్నారు. ఆర్జేడీకి యాదవులను కాదని ముస్లింలు తొలి ప్రాధాన్యంగా మారిందని దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్లో నిరసనలు
-
BCCI: కోచ్గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
-
Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
-
TRAI Tightens Spam Call Rules:స్పామ్ కాల్స్పై ట్రాయ్ కఠిన నిబంధనలు.. AIతో ఫేక్ నంబర్ల గుర్తింపు, భారీ జరిమానాలు!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..