PM Modi: “ముస్లింలకు పూర్తి రిజర్వేషన్లు”.. లాలూ వ్యాఖ్యలపై పీఎం మోడీ ఆగ్రహం..
PM Modi: ముస్లిం రిజర్వేషన్లపై ఆర్జేడీ నేత, మాజీ బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముస్లింల పూర్తి రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించడంపై వివాదం మొదలైంది. పాట్నాలో మీడియాతో మాట్లాడిన లాలూ యాదవ్ రాజ్యాంగాన్ని రద్దు చేయడం ద్వారా రిజర్వేషన్లను తొలగించాలని అధికార బీజేపీ భావిస్తోందని ఆయన ఆరోపించారు. దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలనుకుంటున్నారని ఆర్జేడీ అధినేత అన్నారు.
Read Also: Pannun murder plot: ఖలిస్తాన్ పన్నూ హత్య కుట్రలో భారత్ దర్యాప్తుపై అమెరికా ఎదురుచూపు..
Also Read
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
- Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
- Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
లాలూ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలను మానలేదని, వారికి ఓటేస్తే మీరు శ్వాసించే హక్కును కూడా తీసుకుంటారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న మోడీ మాట్లాడుతూ.. దాణా కుంభకోణంలో నిందితుడు బెయిల్పై బయట ఉన్న నాయకుడు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని అంటున్నారని, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను లాక్కుని ముస్లింలకు ఇవ్వాలని అనుకుంటున్నారని ప్రధాని అన్నారు. ‘‘ కాంగ్రెస్ మౌనంగా ఉంది. కానీ ఈ రోజు దాని మిత్రపక్షాలలో ఒకటి ఇండియా కూటమి ఉద్దేశాలను ధ్రువీకరించింది. ముస్లింలకు ‘సంపూర్ణ’ రిజర్వేషన్లు కావాలని ఆయన అన్నారు. దీని అర్ధం ఏమిటి..?’’ అని ప్రశ్నించారు. తాను జీవించి ఉన్నంత కాలం ‘‘బూటకపు సెక్యులరిజం’’ పేరుతో భారతదేశ గుర్తింపును చెరిపేయడానికి ఎవరినీ అనుమతించనని అన్నారు.
బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మాట్లాడుతూ.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాజ్యాంగ మౌలిక స్వరూపంలో మార్పులు చేయడం ద్వారా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఆర్జేడీ చీఫ్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ఆయన వ్యాఖ్యల్లో పూర్తిగా రిజర్వేషన్లు అనేది చాలా తీవ్రమైందని, వారు ఎస్టీ/ఎస్టీ, ఓబీసీ వాటా నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుకుంటున్నారని అన్నారు. ఆర్జేడీకి యాదవులను కాదని ముస్లింలు తొలి ప్రాధాన్యంగా మారిందని దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో