Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
- మోడీ పర్యటనతో మారిపోయిన లక్షదీవుల టూరిజం..
- భారీగా వెళ్తున్న దేశీయ పర్యాటకులు..
- మాల్దీవులకు భారీగా పడిపోయిన టూరిజం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lakshadweep: ప్రధాని నరేంద్రమోడీ ‘‘కుర్చీ మడతపెడితే’’ ఏమవుతుందో మాల్దీవులకు తెలిసి వచ్చింది. ఇదే సమయంలో మోడీ మాటను భారతీయుల ఎలా వింటారనే దానికి ‘‘లక్షదీవులే’’ నిదర్శనం. 2024లో మాల్దీవులు భారత వ్యతిరేఖ వైఖరిని అవలంభించింది. ప్రధాని మోడీపై అక్కడి ఎంపీలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇదే కాకుండా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజు ‘‘ఇండియా అవుట్’’ అనే నినాదంలో అధికారంలోకి వచ్చారు. ఇదే కాకుండా తన తొలి పర్యటన చైనాలో చేశారు. సహజంగా మాల్దీవుల్లో ఏ కొత్త ప్రభుత్వం వచ్చినా, ప్రభుత్వాధినేత భారత్ సందర్శించడం ఆనవాయితీగా వచ్చింది. కానీ ముయిజు మాత్రం చైనాకు సపోర్ట్ చేశాడు.
ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోడీ లక్షదీవుల పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో ఒక బీచ్లో ఒక కుర్చీలో కూర్చుని లక్షదీవుల అందాన్ని వీక్షిస్తున్న ఫోటోలు, వీడియోలు వైరల్గా మారాయి. ఇంకేముంది మన దేశంలో పర్యాటకులు లక్షదీవులకు క్యూ కట్టారు. 2020లో కేవలం 3,875 నుండి 2024 నాటికి రికార్డు స్థాయిలో 68,328కి పెరిగింది. 2024 జనవరిలో ప్రధాని మోదీ ఈ ద్వీపాన్ని సందర్శించిన తర్వాత పర్యాటకుల సంఖ్యలో ఈ భారీ పెరుగుదల కనిపించింది.లక్షద్వీప్కు వచ్చే పర్యాటకుల సంఖ్య 2023లో 46,551 నుండి 2024 నాటికి 68,328కి పెరిగింది. ఇది ఒక సంవత్సరంలోనే దాదాపు 47 శాతం పెరుగుదల.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ఇదే సమయంలో మాల్దీవులకు వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2023లో 209,193 నుండి 2024 నాటికి 130,805కి పడిపోయింది. ఇది 37.5 శాతం తగ్గుదల. మాల్దీవులకుకు వెళ్లే పర్యాటకుల్లో భారతీయులే అధికారం. మన దేశ పర్యాటకులు వెళ్లకుంటే మాల్దీవుల ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారింది. చివరకు మాల్దీవులు కాళ్ల బేరానికి రావాల్సి వచ్చింది. ఒకప్పుడు మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల్లో భారతీయలు ఫస్ట్ ప్లేస్లో ఉంటే, ఆ దేశ ప్రభుత్వం బలుపు మాటల కారణంగా ఆరో స్థానానికి చేరింది. మోడీ పిలుపుకు స్పందించిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, ట్రావెల్ ఫ్లాట్ఫారమ్స్ లక్షదీవుల పర్యాటకాన్ని మరింతగా ప్రోత్సహించారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!