Karnataka: దీపావళి సందర్భగా KSRTC ప్రయాణికులకు శుభవార్తను చెప్పింది. ఈ నెల 12న నరక చతుర్దశి, 14న బలిపాడ్యమి రానున్నాయి. ఈ పండగల సందర్భంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అలానే పండగకు ఇల్లకు వెళ్లి వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు 2000 అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు KSRTC పేర్కొన్నది. ఈ నేపధ్యంలోఇల్లకు వెళ్లే వాళ్ళ కోసం నవంబర్ 10 నుంచి 12 వరకు అదనంగా 2 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అలానే రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుండి, అలానే అంతర్రాష్ట్రాల నుండి బెంగళూరుకు తిరిగి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం నవంబర్ 14-15 తేదీలలో ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు KSRTC తెలియజేసింది. వాళ్లకు కెంపేగౌడ బస్ స్టేషన్ నుండి ధర్మస్థల, కుక్కేసుబ్రమణ్య, షిమోగా, హసన్, మంగళూరు, కుందాపూర్, శృంగేరి, హొరనాడు, దావణగెరె, హుబ్లీ, ధార్వాడ్, బెల్గాం, విజయపూర్, గోకర్ణ, షిర్సి, కార్వార్, రాయచూర్, కలబురగి, బళ్లారి, కొప్పల్లకు బీదర్, తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ మొదలైన ప్రాంతాలకు ప్రత్యేక రవాణా సేవ అందుబాటులో ఉంది.
Read also:Mahmood Ali: హోంమంత్రి మహమూద్ అలీ కారును చెక్ చేసిన పోలీసులు
అలానే మైసూర్ రోడ్ బస్ స్టేషన్ నుండి మైసూర్, హున్సూర్, పిరియాపట్నం, విరాజ్పేట్, కుశాలనగర్, మడికేరి మార్గం వైపు కార్యకలాపాలు నిర్వహించనున్నారు. తమిళనాడు, కేరళ లోని మధురై, కుంభకోణం, చెన్నై, కోయంబత్తూర్, తిరుచ్చి, పాలక్కాడ్, త్రిస్సూర్, ఎర్నాకులం, కాలికట్ మొదలైన ప్రాంతాలకు వెళ్లే ప్రీమియం రవాణాలు శాంతినగర్ లోని బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్టాండ్ నుండి నడపబడతాయని KSRTC తెలియజేస్తుంది. ప్రయాణీకుల సౌకర్యార్థం అదనపు రవాణా కోసం ముందస్తు సీటు రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించబడ్డాయి. కాగా ఏజెన్సీ ప్రకారం.. నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణికులు కలిసి ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకుంటే 5 శాతం తగ్గింపు లభిస్తుంది. అలానే ఔట్బౌండ్రి, టర్న్ టిక్కెట్లు కలిసి బుక్ చేసుకున్నప్పుడు ప్రయాణ ఛార్జీలో 10 శాతం తగ్గింపు ఇవ్వబడుతుంది. www.ksrtc.karnataka.gov.in వెబ్సైట్ ద్వారా ఈ-టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు.