TmilNadu Air Port: బ్యాగులో కొండ చిలువలు.. ఎయిర్ పోర్టులో అరెస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TmilNadu Air Port: సాధారణంగా ఊరి నుంచి, లేదా విదేశాల నుంచి వస్తుంటే బ్యాగుల్లో బట్టలు లేదా విలువైన వస్తువులు తీసుకొని వస్తారు. లేదంటే మన బంధువులు లేదా స్నేహితులు ఏమైనా కొనుక్కురమ్మంటే ఆ వస్తువులను తీసుకొస్తాం. కానీ ఈ వ్యక్తి వేరే దేశం నుంచి వస్తూ బ్యాగులో ఏకంగా కొండ చిలువలను.. బల్లులను తీసుకొచ్చాడు. ఆయన బ్యాగు నిండా కొండచిలువలు, బల్లులే ఉన్నాయి. విమానం దిగి బయటికి వెళుతున్న అతని బ్యాగును పరిశీలించిన విమానాశ్రయ సిబ్బంది అవాక్కయ్యారు. బ్యాగును తెరచి చూడగా అందులో ఉన్న కొండచిలువలను చూసిన అధికారులు షాక్ గురయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్పోర్టులో జరిగింది.
Read also: Rajasthan: ఓ విద్యార్థిని వాటర్ బాటిల్లో మూత్రం పోసిన విద్యార్థి.. ఆగ్రహించిన గ్రామస్తులు
Also Read
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
వర్షాలు దంచి కొట్టిన సందర్భంలో పలు చోట్ల పాములు జనావాసాల్లోకి వచ్చిన ఘటనలు చూశాం. కానీ, తమిళనాడులోని తిరుచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఒకేసారి 47 కొండచిలువులను పట్టుకోవడం చర్చనీయాంశమైంది. అయితే.. ఇవి వరదల్లో కొట్టుకువచ్చినవి కావు. కావాలనే మలేషియా నుంచి పట్టుకువచ్చినవి. అక్రమంగా వీటిని దేశంలోకి తెచ్చిన ఆ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో మలేషియాకు చెందిన వ్యక్తి వెంట 47 కొండ చిలువలను, రెండు బల్లులను పట్టుకుని దిగాడు. అతని పెట్టె కదులుతున్నట్టు గుర్తించిన కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది. అక్రమంగా తీసుకువచ్చిన ఆ జీవులను తిరిగి మలేషియాకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
Read also: Jawan: వందమంది అమ్మాయిలతో షారుఖ్ .. దుమ్ము దులిపేశాడు అంతే
మలేషియా రాజధాని కౌలలాంపూర్కు చెందిన మహమ్మద్ మెయిద్దీన్ తిరుచి అంతర్జాతీయ విమనాశ్రయంలో దిగాడు. ఆయన ఒక్కడే దిగలేదు. తనతో పాటు 47 కొండచిలువలను, రెండు బల్లులను అక్రమంగా తీసుకువచ్చాడు. విమానం ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత అతని బ్యాగ్లో ఏవో కదులుతున్నట్టు కస్టమ్స్ అధికారులు అనుమానించి తనిఖీలు చేశారు. ఆ బ్యాగ్లో నుంచి పలు జాతులకు చెందిన కొండచిలువలను కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. హోల్స్ ఉన్న బాక్స్లో ఆ కొండచిలువలను, బల్లులను మెయిద్దీన్ వెంట తీసుకు వచ్చాడు. ఆ తర్వాత పోలీసులు మెయిద్దీన్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కొండ చిలువలను తీసుకొచ్చిన విషయాన్ని కస్టమ్స్ అధికారులు ఫారెస్ట్ అధికారులకు తెలిపారు. ఫారెస్ట్ అధికారులు విమానాశ్రయానికి చేరుకుని ఆ మూగ జీవాలను తిరిగి మలేషియా దేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..