Komatireddy Venkat Reddy: డీకే శివకుమార్ తో కోమటిరెడ్డి భేటీ.. కర్ణాటక చేరిన టీ కాంగ్రెస్ రాజ’కీ’యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy met DK Sivakumar in Bangalore: కర్ణాటకలో విజయం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో టీ కాంగ్రెస్ రాజకీయం బెంగళూరుకు మళ్ళింది. గత కొంత కాలంగా పార్టీలో సైలెంట్ గా ఉన్న స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పార్టీలో యాక్టివ్ అయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలను వ్యక్తిగతంగా వారి ఇంటికి వెళ్లి కాంగ్రెస్లో చేరాలని ఆహ్వానించారు. ఇటీవల బెంగళూరు వెళ్లిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలిశారు. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివకుమార్ కర్ణాటకలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పార్టీ గెలుపు కోసం ఆయన సేవలను కొంతైనా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బెంగళూరు వెళ్లిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై డీకే శివకుమార్తో చర్చించినట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రియాంక గాంధీని కలిసి పలు అంశాలపై చర్చించారు.
Read also: Bigg Boss 7: బిగ్ బాస్7 హోస్ట్ ఎవరో తెలిసిపోయిందోచ్..?
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
ఆ తర్వాత పార్టీల్లో పూర్తిగా యాక్టివ్గా ఉన్న కోమటిరెడ్డి ప్రియాంక సూచన మేరకు డీకే శివకుమార్ను కలిశారు. ఈ సమావేశంలో వైఎస్ షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంపైనే ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. డీకే శివకుమార్ కుటుంబంతో షర్మిల కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. షర్మిల వైఎస్సార్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై కోమటిరెడ్డి శివకుమార్తో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి శర్మను కాంగ్రెస్లోకి తీసుకుంటారనే ప్రచారం కూడా సాగుతోంది. అదే సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశాలపై డీకే శివకుమార్తో కోమటిరెడ్డి చర్చిస్తారని తెలుస్తోంది. తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరగాలని టీ కాంగ్రెస్ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ను వీడిన నేతలను మళ్లీ పార్టీలో చేర్చుకోవాలని పిలుపునిచ్చారు.
AI: మీడియాకు ఎసరు పెడుతున్న AI.. 200 మందిని తొలగించిన దిగ్గజ వార్తా సంస్థ..
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!