Kolkata Doctor Case: కోల్కతా వైద్యురాలి హత్య కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం.. సీబీఐకి బదిలీ..
- కోల్కతా వైద్యురాలి హత్యాచార కేసు సీబీఐకి బదిలీ..
- కేసు విచారణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోల్కతా హైకోర్టు..
- సాక్ష్యాలు నాశనం కాకముందే బదిలీ చేయాలని ఆదేశం..
- మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్.. ప్రభుత్వ తీరుపై కోర్టు ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Doctor Case:దేశవ్యాప్తంగా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సంచలనంగా మారిన కోల్కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనలో కోల్కతా హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి బదిలీ చేసింది. దేశవ్యాప్తంగా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సంచలనంగా మారిన కోల్కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనలో బెంగాల్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి బదిలీ చేసింది. కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఛెస్ట్ మెడిసిన్లో పీజీ చేస్తున్న 31 ఏళ్ల వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. రాత్రి డ్యూటీలో ఉన్న సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. శుక్రవారం తెల్లవారుజామున ఆమె మృతదేహం సెమినార్ హాలులో కనుగొనబడింది.
Read Also: US: బంగ్లాదేశ్ అల్లర్లతో సంబంధం లేదు.. ఖండించిన వైట్హౌస్
Also Read
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
- Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
ప్రభుత్వ ఆధీనంలోని కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్పై కోర్టు ఈ రోజు తీవ్రస్థాయిలో మండిపడింది. అతను యాక్టివ్గా లేకపోవడం నిరుత్సాహపరుస్తోందని కోర్టు పేర్కొంది. ఈ ఘటన తర్వాత ప్రిన్సిపాల్ రాజీనామా చేసిన తర్వాత మరో కాలేజీలో ఇదే పోస్టును అప్పగించడంపై కోర్టు ధ్వజమెత్తింది. అతడిని వెంటనే విధుల నుంచి తప్పించి సెలవుపై పంపాలని కోర్టు ఆదేశించింది. ఘోష్ రాజీనామా చేసిన కొద్దిసేపటికే కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా నియమితులైనందుకు ప్రభుత్వాన్ని నిలదీసింది. “ప్రస్తుతం ఉన్న కేసు ఒక విచిత్రమైన కేసు. ఇకపై సమయం వృధా చేయకూడదు. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉండవచ్చు” అని కోర్టు పేర్కొంది. పాలక వర్గం బాధితుడితో కానీ బాధితురాలి కుటుంబంతో లేదని కోర్టు పేర్కొంది. ఘటన జరిగి 5 రోజులు గడిచినా కూడా ఇప్పటి వరకు ముఖ్యమైన నిర్ధారణలు లేవని, అందువల్ల సాక్ష్యాలు ధ్వంసం చేసే అన్ని అవకాశాలు ఉన్నాయని కోర్టు సమర్థించింది. తక్షణమే ఈ కేసును సీబీఐకి బదిలీ చేయడం సముచితమని కోర్టు పేర్కొంది.
బాధితురాలి ఒంటిపై తీవ్రగాయాలు కనిపించాయి. పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె కళ్లు, నోరు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం జరిగింది. మెడ వెముక ఫ్రాక్చర్ అయింది. ముఖంగాపై గోటిలో రక్కిన గుర్తులు ఉన్నాయి. ఆమెపై లైంగిక దాడి జరిగిందని తెలిసింది. ఆమె మృతదేహం సెమినార్ హాలులో కనిపించడం, ఆమె బట్టలు చిందరవందరగా, శరీరం అంతా గాయాలు కనిపించిన తర్వాత ఆస్పత్రి పరిపాలన ప్రతిస్పందించిన తీరుపై కోర్టు తీవ్ర లోపాలను గుర్తించింది. సాక్ష్యాలను తారుమారు చేయకుండా స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని బాధితురాలి తల్లిదండ్రులు కోర్టుని కోరారు. కేవీ రాజేంద్రన్ కేసును ఉదహరించారు. ఈ కేసులో కొన్ని అరుదైన కేసుల్లో న్యాయపరమైన, పూర్తి దర్యాప్తును నిర్ధారించడానికి తప్పనిసరిగా బదిలీ చేసే అధికారాన్ని ఉపయోగించాలని సుప్రీంకోర్టు పేర్కొన్న తీర్పును హైకోర్టు ఉదహరించి, సీబీఐకి కేసుని దర్యాప్తు చేసింది.
తాజావార్తలు
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?