Kolkata doctor case: కోల్కతా డాక్టర్ కేసులో అనేక అనుమానాలు.. ఘటన వెనక డ్రగ్స్ రాకెట్..?
- కోల్కతా డాక్టర్ కేసులో అనేక అనుమానాలు..
- కేసులో డ్రగ్స్ కోణం..? సంజయ్ రాయ్ ప్రధాన నిందితుడు కాదన్న డాక్టర్ పేరెంట్స్..
Kolkata doctor case: కోల్కతా పీజీ ట్రైనీ వైద్యురాలి అత్యాచార, హత్య ఘటన యావద్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కేసులో బాధితురాలికి న్యాయం చేయాలని డాక్టర్లు, ప్రజలు రోడెక్కి నిరసన తెలుపుతున్నారు. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ వైఫల్యం, పోలీసులు నిర్లక్ష్యంపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుని హైకోర్టు సీబీఐకి అప్పగించింది. అయితే, ఈ కేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసుని ఎందుకు బెంగాల్ ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదు..? ఆర్జీ కర్ ఆస్పత్రిపై దుండగుల దాడి, క్రైమ్ సీన్లో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల భాగస్వామ్యం ఉందని ప్రతిపక్షాలతో పాటు సాధారణ ప్రజలు ఆరోపిస్తు్న్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని సీఎం మమతా బెనర్జీ ర్యాలీ చేశారు, ఆస్పత్రి దాడి వెనక బీజేపీ, సీపీఎం పార్టీలు ఉన్నాయని ఆరోపించారు.
ఇదిలా ఉంటే, ఈ కేసులో బాధితురాలి తల్లిదండ్రులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తమ కూతరు చనిపోయిన మొదటి రోజు నుంచే పోలీసులు వేధింపులు ప్రారంభయమ్యాయని, కుమార్తె మృతదేహం చూసేందుకు 3 గంటల పాటు అనుమతించలేదని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఇది ఒక వ్యక్తి చేసిన సంఘటన కాదని, దీని వెనక ఇతరుల ప్రమేయం ఉందని బాధితురాలి తల్లి ఆరోపించారు. తమ కుమార్తె ఆరోగ్యం, ఆమె వద్ద దొరికిన మెడిసిన్స్పై దృష్టి సారించారని, కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
Also Read
Read Also: Crime: మైనర్ బాలికపై బస్సులో సామూహిక అత్యాచారం..
నిజానికి ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని నిందితుడిగా అరెస్ట్ చేశారు. అయితే, అతనే ప్రధాన నేరస్తుడు కాదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి తాము తెలిపామని బాధితురాలి తల్లి చెప్పారు. ‘‘ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి నాకు చెప్పారు. ఆ వ్యక్తి ప్రధాన నిందితుడిగా పరిగణించడం లేదని నేను ఆమెకు చెప్పాను. లోపల నుంచి ఎవరైనా సాయం చేయకుంటే, తన కుమార్తె ఒంటరిగా ఉందని ఎలా తెలుసుకోగలిగాడు..?’’ అని డాక్టర్ తల్లి ఆమె ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే ఈ కేసులో మరికొన్ని కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి ఇప్పటి వరకు ఇవి ఆరోపణలుగా మాత్రమే ఉన్నాయి. ఆస్పత్రిలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సున్నిత సమచారాన్ని డాక్టర్ వెలికి తీసి ఉండొచ్చని, ఇందులో డ్రగ్ సైఫనింగ్ రాకెట్ ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, కోల్కతా పోలీసులు మాత్రం వీటన్నింటిని ఊహాగానాలుగా కొట్టిపారేశారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో