Kolkata Doctor Rape Case: సీఎంతో మరోసారి చర్చలు జరపాలి.. బెంగాల్ డాక్టర్స్ డిమాండ్..!
- కోల్కతాలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచార ఘటన తీవ్ర దుమారం..
- ఆరోగ్య కార్యదర్శిని తొలగించాలని డిమాండ్ చేసిన డాక్టర్లు..
- మరోసారి సీఎం మమతాతో చర్చలు జరపాలని వైద్యుల డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Doctor Rape Case: కోల్కతాలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచార ఘటన తీవ్ర ప్రకంపనలు రేపుతుంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చర్చలు జరిపిన వైద్యులు తమ నిరసనలు ఇంకా కొనసాగిస్తున్నారు. మరికొన్ని డిమాండ్లను వినిపించేందుకు మరోసారి ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలికి పూర్తిగా న్యాయం జరిగేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు.
Read Also: MAD Square : ఫస్ట్ లుక్ – ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసింది..
Also Read
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
ఇక, ఆరోగ్య కార్యదర్శిని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు (బుధవారం) ఉదయం నుంచి రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రధాన ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. మా డిమాండ్లు పూర్తిగా నెరవేరేంత వరకు ఈ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని డాక్టర్లు హెచ్చరించారు. కోల్కతా ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎన్ఎస్ నిగమ్ను వెంటనే డ్యూటీ నుంచి తొలగించాలి అన్నారు. అంతేకాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో సురక్షిత వాతావరణం కల్పించాలి అని వారు డిమాండ్ చేశారు. ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించడం అసవరం అని చెప్పుకొచ్చారు. మరికొన్ని డిమాండ్లను వినిపించేందుకు ముఖ్యమంత్రితో మరోసారి చర్చలకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు వెల్లడించారు.
Read Also: CV Anand: వచ్చే ఏడాది నుంచి పద్ధతి మారాలి.. భక్తులకు సీవీ ఆనంద్ విజ్ఞప్తి
కాగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మరో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్కు మెయిల్ పంపినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో డాక్టర్లకు కల్పించే భద్రతతో పాటు ప్రభుత్వం కేటాయించిన 100 కోట్ల రూపాయలను ఎలా ఖర్చు చేయాలనుకుంటున్నారనే అంశాలపై సమగ్రంగా చర్చించాలని వారు కోరారు. కాగా, జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తుంది. ఈ ఘటనను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న డాక్టర్లతో రాష్ట్ర సీఎం మమతా చర్చలు జరిపారు.
తాజావార్తలు
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?