CV Anand: వచ్చే ఏడాది నుంచి పద్ధతి మారాలి.. భక్తులకు సీవీ ఆనంద్ విజ్ఞప్తి
- చ్చే ఏడాది నుంచి అయినా ఈ పద్ధతి మానుకోవాలని..
- 11వ రోజే నిమజ్జనం పూర్తి చేసేలా తరలి రావాలని భక్తులకు సీపీ సీవీ ఆనంద్ విజ్ఞప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CV Anand: వచ్చే ఏడాది నుంచి అయినా ఈ పద్ధతి మానుకోవాలని, 11వ రోజే నిమజ్జనం పూర్తి చేసేలా తరలి రావాలని కోరుతున్నానని భక్తులకు సీపీ సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు. ఇంకా వెయ్యి విగ్రహాల వరకు నిమజ్జనం కోసం ఉన్నాయని త్వరగా నిమజ్జన ప్రక్రియ పూర్తి చేస్తున్నామని అన్నారు. వినాయక నిమజ్జనం కోసం ప్రభుత్వం ఒకరోజు సెలవు కూడా ఇస్తోందని గుర్తు చేశారు. కానీ కొందరు శోభాయత్రలను సెలవు రోజు అర్ధరాత్రి, తెల్లవారుజామున స్టార్ట్ చేస్తున్నారని అన్నారు. ఇలా చేయడం వల్ల నిమజ్జనం మరుసటిరోజు సాయంత్రం వరకు జరుగుతోందని తెలిపారు. దీనివల్ల నిమజ్జనం ఆలస్యం అవడంతోపాటు.. సామాన్య జనులకు కూడా ఇబ్బంది అవుతోందని అన్నారు. వచ్చే ఏడాది నుంచి అయినా ఈ పద్ధతి మానుకోవాలి.. 11వ రోజే నిమజ్జనం పూర్తి చేసేలా తరలి రావాలని సీవీ ఆనంద్ కోరారు.
Read also: Hyderabad : జానీ మాస్టర్కు పోలీసుల నోటీసులు.. పరారీలో జానీ
Also Read
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
ట్యాంక్ బండ్ పై బందోబస్తు పరంగా పూర్తి స్థాయిలో ఉందని అన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రయాణికులకు పంపిస్తున్నామన్నారు. ఉదయం 10.30 నుంచి అన్ని జంక్షన్స్ లో ట్రాఫిక్ రిలీజ్ చేసామన్నారు. గత ఏడాది కన్నా ముందే ట్రాఫిక్ క్లియరెన్స్ ఇచ్చామన్నారు. దాదాపుగా అన్ని ఫ్లై ఓవర్ లు వదిలేసామన్నారు. ప్రణాళిక ప్రకారం ఖైరతాబాద్ గణపతి ఉదయం 6.30 కి మొదలుకుని మధ్యాహ్నం 1.30 కి నిమజ్జనం పూర్తి అయ్యిందన్నారు. ఉత్సవ కమిటీ కి ధన్యవాదాలు తెలిపారు. మా టీం లా అండ్ ఆర్డర్ అధికారులు చాలా బాగా కృషి చేశారన్నారు. సౌత్ వెస్ట్ లో కొన్ని మండపాల నిర్వాహకులు ఇంకా ముందుకు రాలేదు… వారు అర్దం చేసుకోవాలని తెలిపారు. నిన్న సెలవు ప్రకటించి నిమజ్జనం చేసుకున్నాం… కానీ ఇష్టానుసారంగా వ్యవహరించారు.. కొందరు అంటూ సీరియస్ అయ్యారు. పోలీసులకు, GHMC అధికారులకు సహకరించాలన్నారు.
Read also: Road Accident: తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు.. 5 గురు మృతి, పలువురికి గాయాలు.
హుస్సేన్ సాగర్ లో 5500 విగ్రహాలు నిమజ్జనం అయ్యింది… ఇవన్నీ రికార్డులో ఉన్నాయన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా గణేస్ నిమజ్జనానికి వచ్చారని… అవి దాదాపుగా 15 వేల వరకు ఉంటాయని అంచనా వేశారు. 15-20 అడుగుల విగ్రహాలు కొన్ని వచ్చి కొన్ని ప్లేస్ లలో ఆగిపోయాయన్నారు. అబిడ్స్ లో అలాగే కొన్ని ప్రాంతాల్లో టస్కర్ లు, వాహనాలు కండిషన్ బాగోలేక ఆగిపోయాయని క్లారిటీ ఇచ్చారు. లేకపోతే ఇంకా త్వరగా నిమజ్జనం పూర్తి అయ్యేవని అన్నారు. మా లా అండ్ ఆర్డర్… మిగితా పోలీసు అధికారులు, GHMC మిగితా అన్ని విభాగాల అధికారులు అందరూ 40 గంటలకు పైగా పని చేస్తున్నారని.. వారందరికీ అభినందనలు తెలిపారు. చిక్కడపల్లి, ఈస్ట్ జోన్ లో కొన్ని సమస్యలు వచ్చాయని.. తాగి గొడవలయ్యాయని తెలిపారు. మొత్తం 10 రోజుల్లో హుస్సేన్ సాగర్ లేక్ లో లక్ష విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని, 10 పోలీసు సిటీ వాళ్ళు మిగితా ఇంకో 10 వేలు.. ఇతర జిల్లాల వారు పోలీసులు ఉన్నారని పేర్కొన్నారు.
Tank Bund Updates: ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..
తాజావార్తలు
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?