Kishan Reddy: నిరుద్యోగం విషయంలో రాహుల్ గాంధీ తప్పుడు వ్యాఖ్యలు చేశారు..
- నిరుద్యోగ సమస్యను యూపీఏ, ఎన్డీయేలు రిష్కరించలేకపోయాయి: రాహుల్ గాంధీ
- రాహుల్ గాంధీ యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎన్డీయే సర్కార్ కు ఆపాదిస్తున్నాడు..
- నిరుద్యోగం విషయంలో రాహుల్ గాంధీ తప్పుడు వ్యాఖ్యలు చేశాడు: కిషన్ రెడ్డి
Kishan Reddy: నిరుద్యోగ్యం విషయంలో యూపీఏ, ఎన్డీయే రెండూ విఫలమయ్యాయి అంటూ రాహుల్ గాంధీ ఈ రోజు పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ చేశారు.. అందులో, తెలుగులో ఒక సామెత ఉంది- పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తోంది అన్నాడట.. అచ్చం అలాగే, రాహుల్ ఈ రోజు చేసిన వ్యాఖ్యలకు ఈ సామెతకు సరిపోతుందన తెలిపారు. ఇక, రాహుల్ గాంధీ యూపీఏ ప్రభుత్వంలోని వైఫల్యాలను చూసి, వాటిని ఎన్డీయే సర్కారుకి ఆపాదించడం అతని అవివేకానికి నిదర్శనం అన్నారు. ఉపాధి విషయంలో ప్రత్యేకంగా రాహుల్ కోసం కొన్ని వాస్తవాలను ఇక్కడ తెలియజేస్తున్నాను అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
Read Also: PM Modi: ‘‘నెహ్రూ టైంలో పావు వంతు, ఇందిరా టైంలో రూ. 10 లక్షల టాక్స్’’..
Also Read
- Tamil Nadu Politics: నిమిషానికో మలుపు.. విజయ్ మాస్టార్ ప్లాన్.. ఏఐఏడీఎంకేతో చర్చలు!
- TVK Vijay: విజయ్ తన భవిష్యత్తును ముందే ఊహించారా?.. GOATలో విజయ్ నంబర్ ప్లేట్ వైరల్
- West Bengal Violence: బెంగాల్లో ఎన్నికల రక్తపాతం.. కత్తితో వెంటాడిన టీఎంసీ నేత.. ఇద్దరు కార్యకర్తల హత్య!
- Tamil Nadu: స్టాలిన్ భిక్షతో గెలిచి.. విజయ్ పంచన చేరుతారా? కాంగ్రెస్పై డీఎంకే ఘాటు విమర్శలు
* కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనలో ఉపాధి అవకాశాలు 6 శాతం పెరిగితే, బీజేపీ పాలనలో 36 శాతం పెరిగాయి..
* ఆర్బీఐ నివేదిక ప్రకారం యూపీఏ 10 సంవత్సరాల పాలనలో 2.9 కోట్ల ఉద్యోగాల సృష్టిస్తే.. ఒక్క 2024 సంవత్సరంలోనే 4.9 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు.
* 2014 నుంచి 2024 వరకు మొత్తం 10 ఏళ్లలో నరేంద్ర మోడీ పాలనలో 17.6 కోట్ల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.
* వ్యవసాయ రంగంలో ఉపాధి కాంగ్రెస్ హయాంలో 16 శాతం తగ్గితే, మోడీ హయాంలో 19 శాతం పెరిగింది.
* సర్వీస్ సెక్టార్ లో ఉపాధి అవకాశాలు కాంగ్రెస్ హయాంలో 25 శాతం పెరిగితే, బీజేపీ హయాంలో 36 శాతం పెరిగింది.
* 2023-24 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు 3.2 శాతానికి తగ్గిపోయింది.
* అలాగే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఉపాధి పొందుతున్నవారు 2013లో 33.95 శాతం ఉండగా, 2024లో అది 54.81 శాతానికి పెరిగింది.
* గ్రామీణ మహిళలలో సొంత బ్యాంకు ఖాతా కలిగిన కార్మికులు/పారిశ్రామికవేత్తలు 2017-18లో 19 శాతం ఉండగా.. 2023-24 నాటికి ఇది 31.2 శాతానికి పెరిగింది. దీంతో, స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆదాయాన్ని ఆర్జించే మహిళా కార్మికులు/ పారిశ్రామికవేత్తల వైపు మారుతున్న దృక్పథాన్ని తెలియజేస్తుందన్నారు. ఈ గణాంకాలన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన నివేదికలో స్పష్టంగా తెలియజేసినవే అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
తెలుగులో ఒక సామెత ఉంది – "పచ్చ కామెర్లు వచ్చిన ఒకతను లోకమంతా పచ్చగా కనిపిస్తోంది అన్నాడట"; నిరుద్యోగ్యం విషయంలో యూపీఏ, ఎన్డీయే రెండూ విఫలమయ్యాయి అంటూ రాహుల్ గాంధీ ఈ రోజు పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు అచ్చం ఈ సామెతకు సరిపోతాయి.
రాహుల్ గాంధీ యూపీఏ ప్రభుత్వంలోని వైఫల్యాలను చూసి,…
— G Kishan Reddy (@kishanreddybjp) February 3, 2025
తాజావార్తలు
-
Rajasthan Royals FIR: వైభవ్ సూర్యవంశీ వివాదం.. రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీపై ఎఫ్ఐఆర్ నమోదు!
-
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ సరసన కృతిసనన్..
-
Tamil Nadu Politics: నిమిషానికో మలుపు.. విజయ్ మాస్టార్ ప్లాన్.. ఏఐఏడీఎంకేతో చర్చలు!
-
Mrunal Thakur: ‘యల్లమ్మ’ మూవీలో హీరోయిన్ దొరికినట్టేనా..!
-
TVK Vijay: విజయ్ తన భవిష్యత్తును ముందే ఊహించారా?.. GOATలో విజయ్ నంబర్ ప్లేట్ వైరల్
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!