Delhi Drug Case: రూ. 5000 కోట్ల డ్రగ్స్ కేసు.. ప్రధాన సూత్రధారితో కాంగ్రెస్కి సంబంధం..
- ఢిల్లీలో పట్టుబడిన రూ.5000 కోట్ల విలువైన డ్రగ్స్..
- ప్రధాన సూత్రధారితో కాంగ్రెస్ పార్టీకి సంబంధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Drug Case: ఢిల్లీలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడిన కేసులో ప్రధాన సూత్రధారి కాంగ్రెస్ కార్యకర్త అని పోలీస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ మాజీ కార్యకర్తగా ఆరోపించబడుతున్న ఇతడికి ఆ పార్టీతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణ ఢిల్లీలో బుధవారం నిర్వహించిన దాడిలో రూ. 5600 కోట్ల విలువైన 500 కిలోల కొకైన్,40 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారి తుషార్ గోయల్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
40 ఏళ్ల గోయల్ 2022 వరకు ఢిల్లీ పీసీసీ ఆర్టీఐ సెల్ చైర్మన్గా పనిచేశారని విచారణ సందర్భంగా అంగీకరించాడు. గోయల్ తన సోషల్ మీడియా ప్రొఫైల్లో ఆర్టీఐ చైర్మన్, ఢిల్లీ పీసీసీ అని పెట్టుకున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఇతను లోక్సభ ఎంపీ దీపేందర్ సింగ్, హర్యానా పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్తో సహా ప్రముఖ కాంగ్రెస్ నేతలతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేశాడు.
Also Read
- Bhojshala case: భోజ్శాల ఒక దేవాలయం.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
- PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
Read Also: Minister Savita: బీసీ కుల వృత్తుల్లో నైపుణ్యం పెంచి జీవనోపాధి పెంపొందించేలా ఆర్థిక చేయూత..
ఈ కేసులో గోయల్తో పాటు ఢిల్లీకి చెందిన హిమాన్షు కుమార్, ఔరంగజేబ్ సిద్ధికీ, భరత్ కుమార్ జైన్లతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొకైన్ వివిధ రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీకి స్మగ్లింగ్ అవుతోందని, గంజాయి థాయ్లాండ్ లోని ఫుకెట్ నుంచి వచ్చినట్లు తేలింది. నిందితులు క్రిప్టోకరెన్సీని ఉపయోగించి నిఘా వర్గాల నుంచి తప్పించుకున్నారు. కొకైన్ రవాణా వెనక దుబాయ్కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ప్రయేయం తెలుస్తోంది. ఢిల్లీలో హై ప్రొఫైల్ పార్టీలకు ఈ డ్రగ్స్ సరఫరా చేయబడుతున్నట్లు తేలింది. ఈ డ్రగ్ కార్టెల్ ప్రధాన సూత్రధాని పశ్చిమాసియా దేశం నుంచి భారతదేశంలో తన కార్యకలాపాలను నడుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Bhojshala case: భోజ్శాల ఒక దేవాలయం.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!