Kerala Train Attack: కేరళ ట్రైన్ ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala Train Attack: కేరళ ట్రైన్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ట్రైన్ లో నిప్పంటించి ముగ్గురు మరణాలకు కారణం అయిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిలో ఉగ్రవాద కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు షారుఖ్ సైఫీని మహారాష్ట్రలోని రత్నగిరి రైల్వే స్టేషన్ లో నిన్న రాత్రి పట్టుకున్నారు. మహరాష్ట్ర పోలీసులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ లో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు.
Read Also: Assam MLA: తాజ్మహల్, కుతుబ్మినార్లను కూల్చేయండి.. మోడీ జీ
Also Read
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
కేరళ ట్రైన్ అటాక్:
ఏప్రిల్ 2న రాత్రి 9.45 గంటల ప్రాంతంలో అలపూజా-కన్నూర్ ఎక్స్ప్రెస్ రైలు కోజికోడ్ దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తి నిప్పటించాడు. ఈ ఘటనలో 8 మందికి కాలిన గాయాలు అయ్యాయి. ఈ ఘటన తర్వాత ఏడాది వయసు ఉన్న చిన్నారి, ఒక మహిళతో పాటు ముగ్గురు రైలు నుంచి తప్పిపోయారు. అదే రోజు వీరంతా ఎలత్తూర్ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపై శవాలుగా కనిపించారు. బోగీలో మంటలు వ్యాపించడంతో భయంతో వీరంతా దూకి చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేరళ పోలీసులు సిట్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో ఉగ్రవాద కోణాన్ని కొట్టి పారేలేయమని కేరళ డీజీపీ అనిత్ కాంత్ అన్నారు. నిందితుడికి సంబంధించి స్కెచ్ ను పోలీసులు విడుదల చేశారు. ఉత్తర్ ప్రదేశ్, నోయిడా, ఘజియాబాద్, హర్యానాల్లో పలు ప్రాంతాల్లో నిందితుడి కోసం సోదాలు నిర్వహించారు.
నిందితుడు దొరికిందిలా..
రైలులో తోటి ప్రయాణికులకు నిప్పటించిన తర్వాత నిందితుడు షారుఖ్ సైఫీ పరారీలో ఉన్నాడు. మంగళవారం మహారాష్ట్ర రత్నగిరిలో అతడి ఆచూకీని నిఘా బృందాలు కనిపెట్టాయి. రైలులో నిప్పు పెట్టిన తర్వాత రైలు నుంచి కింద పడటంతో అతడి తలకు గాయాలై రత్నగిరి సివిల్ ఆస్పత్రిలో చేరాడు. అయితే చికిత్స పూర్తికాకముందే అక్కడి నుంచి పారిపోయాడు. రత్నగిరి ప్రాంతంలో సోదాలు నిర్వహించగా నిందితుడు దొరికాడు.
తాజావార్తలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..