MA Baby: సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ.. ఆయన నేపథ్యం ఇదే..
- సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ..
- కేరళ నుంచి ఈ పదవి అందుకున్న రెండో వ్యక్తిగా గుర్తింపు..
- బేబీకి శుభాకాంక్షలు చెప్పిన స్టాలిన్, పినరయి, శశి థరూర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MA Baby: సీపీఎం పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిగా కేరళకు చెందిన ఎంఏ బేబీని ఎన్నుకున్నారు. 71 ఏళ్ల బేబీ సీపీఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు. తమిళనాడు మధురైలో జరిగిన సీపీఎం 24వ పార్టీ కాంగ్రెస్లో ఎంఏ బేబీని పార్టీ చీఫ్గా ఎన్నుకున్నారు. కేరళ నుంచి పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన రెండో వ్యక్తిగా ఈయన నిలిచారు. అంతకుముందు కేరళ మొదటి ముఖ్యమంత్రి ఈఎంఎస్ నంబూద్రిపాల్ సీపీఎంకు నాయకత్వం వహించారు. గతేడాది సీతారాం ఏచూరి మరణం తర్వాత ఈ పదవి ఖాళీగా ఉంది. తాత్కాలికంగా ప్రకాష్ కారత్ పదవిని నిర్వహిస్తున్నాడు. మైనారిటీ కమ్యూనిటీ నుంచి సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తొలి నేతగా బేబీ రికార్డ్ సృష్టించారు.
Read Also: Sambhal: సంభాల్ మసీదు వద్ద పోలీస్ అవుట్పోస్ట్.. ప్రారంభించిన 8 ఏళ్ల బాలిక..
Also Read
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్లో కీలక వ్యాఖ్యలు
- Cockroach Janta Party: ఢిల్లీలో "కాక్రోచ్ జనతా పార్టీ" ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
కేరళలో అధికారి సీపీఎం పార్టీలో బేబీ సీనియర్ నేతగా ఉన్నారు. ఈయన గతంలో 2006-2011 వరకు కేరళ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1986-1998 మధ్య రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన బేబీకి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని విజయవంతంగా నడిపిస్తారని ఆకాంక్షించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి కూడా శుభాకాంక్షలు తెలిపారు. కేరళలోని కొల్లాం జిల్లాలో జన్మించిన ఎంఏ బేబీ విద్యార్థి దశ నుంచే సీపీఎం పార్టీతో సంబంధం ఉంది. పార్టీలో వివిధ స్థాయిల్లో ఆయన పనిచేశారు. పార్టీ స్టూడెంట్ వింగ్ ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐలో కీలక పదవులు నిర్వహించారు.
పార్టీ చీఫ్తో సహా 85 మంది సభ్యుల కొత్త కేంద్ర కమిటీని కూడా ఎన్నుకున్నారు. ఇది 18 మంది సభ్యుల పోలిట్ బ్యూరోని ఎన్నుకుంది. కొత్తగా ఎన్నికైన పోలిట్ బ్యూరోలో పినరయి విజయన్తో పాటు సీనియర్ నేతలు బివి రాఘవులు, తపన్ సేన్, నీలోత్పల్ బసు, ఎండీ సలీం, ఎ విజయరాఘవన్, అశోక్ ధావలే, రామచంద్ర డోమ్, ఎంవి గోవిందన్, అమ్రా రామ్, విజూ కృష్ణన్, మరియం ధావలే, యు వాసుకిత్, కె బాలకృష్ణన్, అరుణ్ దీప్, చోవుద్దాచ్, జె.బాలకృష్ణన్, ఎంఏ బేబీ ఉన్నారు.
తాజావార్తలు
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!