Sambhal: సంభాల్ మసీదు వద్ద పోలీస్ అవుట్పోస్ట్.. ప్రారంభించిన 8 ఏళ్ల బాలిక..
- సంభాల్ హింస ప్రదేశంలో పోలీస్ అవుట్పోస్ట్..
- షాహీ జామా మసీదుకు సమీపంలో ఏర్పాటు..
- ప్రారంభించిన 8 ఏళ్ల బాలిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambhal: గతేడాది నవంబర్లో సంభాల్ హింసాకాండ యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారింది. మసీదు సర్వే కోసం వచ్చిన అధికారులపై ముస్లిం మూక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో నలుగురు మరణించారు. 30 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. ఈ హింసాత్మక ఘర్షణ జరిగిన ప్రదేశంలో, షాహీ జామా మసీదు సమీపంలో పోలీస్ అవుట్పోస్ట్ ప్రారంభించారు. ఈ పోలీస్ అవుట్పోస్ట్ని 8 ఏళ్ల గుంగున్ కశ్యప్ అనే బాలిక ప్రారంభించడం విశేషం.
గతేడాది నవంబర్లో చెలరేగిన కోట్ గర్వి ప్రాంత నివాసి అయిన గుంగున్ రిబ్బన్ కత్తిరించి సత్యవ్రత్ పోలీస్ అవుట్పోస్ట్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజేందర్ పెన్సియా, ఎస్పీ కృష్ణ కుమార్ విష్ణోయ్, అదనపు ఎస్పీ (నార్త్) శ్రీష్ చంద్ర, సంభాల్ సర్కిల్ ఆఫీస్ అనుజ్ చౌదరి, అస్మోలి సర్కిల్ ఆఫీసర్ కుల్దీప్ సింగ్, ఇన్స్పెక్టర్ అనుజ్ తోమర్ పాల్గొన్నారు.
Also Read
- Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
- Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..
- Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
- Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
Read Also: Heart Attack: కాలేజ్లో స్పీచ్ ఇస్తూనే.. గుండెపోటులో మరణించిన 20 ఏళ్ల విద్యార్థిని..
నవంబర్ 24న జరిగిన హింస తర్వాత, ఈ ప్రాంతంలో గట్టి నిఘా పెట్టేందుకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పోలీస్ అవుట్పోస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 28న సత్యవ్రత్ పోలీస్ పోస్ట్కు శంకుస్థాపన చేశారు. దీనిని నిర్మించేందుకు దాదాపుగా 100 రోజులు పట్టింది. రెండు అంతస్తుల పోలీస్ అవుట్పోస్ట్లో శాటిలైట్ టవర్, జిల్లా కంట్రోల్ రూం, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. కోట్ పూర్వి, కోట్ గర్వి, కోట్ పశ్చిమ్ ప్రాంతాలపై నిఘా ఉంచేందుకు ఈ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు.
హిందూ పురాణాల ప్రకారం సంభాల్కి చాలా ప్రాముఖ్యత ఉంది. భగవాన్ శ్రీ మహా విష్ణువు కలియుగ అవతారం కల్కి ఈ సంభాల్ నుంచే వస్తారని హిందువుల నమ్మకం. వివాదానికి కేంద్రంగా ఉన్న షాహీ జామా మసీదు ఒకప్పుడు హరిహర్ మందిరమని, మొఘల్స్ దీన్ని కూల్చివేసి మసీదు నిర్మించారని కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో, కోర్టు ఆదేశాల మేరకు సర్వేకు వెళ్లిన సిబ్బందిపై దాడి జరిగింది.
తాజావార్తలు
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
-
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
-
Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
-
SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా..
-
ICC: కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. టీ20, వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లలో పలు మార్పులు..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!