Sambhal: సంభాల్ మసీదు వద్ద పోలీస్ అవుట్పోస్ట్.. ప్రారంభించిన 8 ఏళ్ల బాలిక..
- సంభాల్ హింస ప్రదేశంలో పోలీస్ అవుట్పోస్ట్..
- షాహీ జామా మసీదుకు సమీపంలో ఏర్పాటు..
- ప్రారంభించిన 8 ఏళ్ల బాలిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambhal: గతేడాది నవంబర్లో సంభాల్ హింసాకాండ యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారింది. మసీదు సర్వే కోసం వచ్చిన అధికారులపై ముస్లిం మూక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో నలుగురు మరణించారు. 30 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. ఈ హింసాత్మక ఘర్షణ జరిగిన ప్రదేశంలో, షాహీ జామా మసీదు సమీపంలో పోలీస్ అవుట్పోస్ట్ ప్రారంభించారు. ఈ పోలీస్ అవుట్పోస్ట్ని 8 ఏళ్ల గుంగున్ కశ్యప్ అనే బాలిక ప్రారంభించడం విశేషం.
గతేడాది నవంబర్లో చెలరేగిన కోట్ గర్వి ప్రాంత నివాసి అయిన గుంగున్ రిబ్బన్ కత్తిరించి సత్యవ్రత్ పోలీస్ అవుట్పోస్ట్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజేందర్ పెన్సియా, ఎస్పీ కృష్ణ కుమార్ విష్ణోయ్, అదనపు ఎస్పీ (నార్త్) శ్రీష్ చంద్ర, సంభాల్ సర్కిల్ ఆఫీస్ అనుజ్ చౌదరి, అస్మోలి సర్కిల్ ఆఫీసర్ కుల్దీప్ సింగ్, ఇన్స్పెక్టర్ అనుజ్ తోమర్ పాల్గొన్నారు.
Also Read
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
- CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
- Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
Read Also: Heart Attack: కాలేజ్లో స్పీచ్ ఇస్తూనే.. గుండెపోటులో మరణించిన 20 ఏళ్ల విద్యార్థిని..
నవంబర్ 24న జరిగిన హింస తర్వాత, ఈ ప్రాంతంలో గట్టి నిఘా పెట్టేందుకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పోలీస్ అవుట్పోస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 28న సత్యవ్రత్ పోలీస్ పోస్ట్కు శంకుస్థాపన చేశారు. దీనిని నిర్మించేందుకు దాదాపుగా 100 రోజులు పట్టింది. రెండు అంతస్తుల పోలీస్ అవుట్పోస్ట్లో శాటిలైట్ టవర్, జిల్లా కంట్రోల్ రూం, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. కోట్ పూర్వి, కోట్ గర్వి, కోట్ పశ్చిమ్ ప్రాంతాలపై నిఘా ఉంచేందుకు ఈ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు.
హిందూ పురాణాల ప్రకారం సంభాల్కి చాలా ప్రాముఖ్యత ఉంది. భగవాన్ శ్రీ మహా విష్ణువు కలియుగ అవతారం కల్కి ఈ సంభాల్ నుంచే వస్తారని హిందువుల నమ్మకం. వివాదానికి కేంద్రంగా ఉన్న షాహీ జామా మసీదు ఒకప్పుడు హరిహర్ మందిరమని, మొఘల్స్ దీన్ని కూల్చివేసి మసీదు నిర్మించారని కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో, కోర్టు ఆదేశాల మేరకు సర్వేకు వెళ్లిన సిబ్బందిపై దాడి జరిగింది.
తాజావార్తలు
-
North Korea: ఫుట్బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్హ్యాండ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
-
Special Trains: సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
-
Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
ట్రెండింగ్
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!