Sambhal: సంభాల్ మసీదు వద్ద పోలీస్ అవుట్పోస్ట్.. ప్రారంభించిన 8 ఏళ్ల బాలిక..
- సంభాల్ హింస ప్రదేశంలో పోలీస్ అవుట్పోస్ట్..
- షాహీ జామా మసీదుకు సమీపంలో ఏర్పాటు..
- ప్రారంభించిన 8 ఏళ్ల బాలిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambhal: గతేడాది నవంబర్లో సంభాల్ హింసాకాండ యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారింది. మసీదు సర్వే కోసం వచ్చిన అధికారులపై ముస్లిం మూక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో నలుగురు మరణించారు. 30 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. ఈ హింసాత్మక ఘర్షణ జరిగిన ప్రదేశంలో, షాహీ జామా మసీదు సమీపంలో పోలీస్ అవుట్పోస్ట్ ప్రారంభించారు. ఈ పోలీస్ అవుట్పోస్ట్ని 8 ఏళ్ల గుంగున్ కశ్యప్ అనే బాలిక ప్రారంభించడం విశేషం.
గతేడాది నవంబర్లో చెలరేగిన కోట్ గర్వి ప్రాంత నివాసి అయిన గుంగున్ రిబ్బన్ కత్తిరించి సత్యవ్రత్ పోలీస్ అవుట్పోస్ట్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజేందర్ పెన్సియా, ఎస్పీ కృష్ణ కుమార్ విష్ణోయ్, అదనపు ఎస్పీ (నార్త్) శ్రీష్ చంద్ర, సంభాల్ సర్కిల్ ఆఫీస్ అనుజ్ చౌదరి, అస్మోలి సర్కిల్ ఆఫీసర్ కుల్దీప్ సింగ్, ఇన్స్పెక్టర్ అనుజ్ తోమర్ పాల్గొన్నారు.
Also Read
- CM Vijay Removes White Towel: బ్రిటిష్ విఐపి సంస్కృతికి చెక్ పెట్టిన సీఎం విజయ్.. కుర్చీ నుంచి వైట్ టవల్ తొలగింపు
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
Read Also: Heart Attack: కాలేజ్లో స్పీచ్ ఇస్తూనే.. గుండెపోటులో మరణించిన 20 ఏళ్ల విద్యార్థిని..
నవంబర్ 24న జరిగిన హింస తర్వాత, ఈ ప్రాంతంలో గట్టి నిఘా పెట్టేందుకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పోలీస్ అవుట్పోస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 28న సత్యవ్రత్ పోలీస్ పోస్ట్కు శంకుస్థాపన చేశారు. దీనిని నిర్మించేందుకు దాదాపుగా 100 రోజులు పట్టింది. రెండు అంతస్తుల పోలీస్ అవుట్పోస్ట్లో శాటిలైట్ టవర్, జిల్లా కంట్రోల్ రూం, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. కోట్ పూర్వి, కోట్ గర్వి, కోట్ పశ్చిమ్ ప్రాంతాలపై నిఘా ఉంచేందుకు ఈ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు.
హిందూ పురాణాల ప్రకారం సంభాల్కి చాలా ప్రాముఖ్యత ఉంది. భగవాన్ శ్రీ మహా విష్ణువు కలియుగ అవతారం కల్కి ఈ సంభాల్ నుంచే వస్తారని హిందువుల నమ్మకం. వివాదానికి కేంద్రంగా ఉన్న షాహీ జామా మసీదు ఒకప్పుడు హరిహర్ మందిరమని, మొఘల్స్ దీన్ని కూల్చివేసి మసీదు నిర్మించారని కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో, కోర్టు ఆదేశాల మేరకు సర్వేకు వెళ్లిన సిబ్బందిపై దాడి జరిగింది.
తాజావార్తలు
-
CSK Playoff Chances: ఇక మిగిలింది రెండు మ్యాచ్లే.. చెన్నై ప్లేఆఫ్స్ చేరుతుందా? సమీకరణాలు ఇవే..
-
Astrology: మే 16 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం…!
-
CM Vijay Removes White Towel: బ్రిటిష్ విఐపి సంస్కృతికి చెక్ పెట్టిన సీఎం విజయ్.. కుర్చీ నుంచి వైట్ టవల్ తొలగింపు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..