Kerala: ఐఏఎస్ హిందూ-ముస్లిం వాట్సప్ గ్రూప్పై దుమారం.. కేరళ ప్రభుత్వం ఏం చేసిందంటే..!
- కేరళలో ఐఏఎస్ హిందూ, ముస్లిం వాట్సాప్ గ్రూపులపై దుమారం
- ఒకరిపై సస్పెండ్ ఎత్తివేత.. ఇంకొకరిపై కొనసాగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐఏఎస్.. దేశంలో అత్యంత పవర్ఫుల్ ఉద్యోగం. ఎంతో టాలెంట్ ఉంటేనే గానీ.. ఈ ఉద్యోగం సాధించలేరు. ఎంతో ఉన్నంతంగా ఉండాల్సిన బ్యూరోక్రాట్లు దారి తప్పారు. ప్రభుత్వ ఆగ్రహంతో సస్పెన్స్కు గురయ్యారు. ఇంతకీ వారిద్దరూ ఎవరు? వాళ్లు చేసిన పనేంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Pakistan: పాకిస్తాన్కి ‘‘జాక్పాట్’’ తగిలింది.. సింధునదిలో భారీగా బంగారు నిల్వలు..
Also Read
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
- Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
కేరళను హిందూ, ముస్లిం వాట్సాప్ గ్రూపులు తీవ్ర దుమారం రేపాయి. చివరికి ఇద్దరు బ్యూరోక్రాట్లు సస్పెండ్కు గురయ్యారు. తాజాగా ఒకరిపై ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తేయగా.. ఇంకొకరిపై కొనసాగించింది. గోపాలకృష్ణన్, ప్రశాంత్ ఇద్దరూ ఐఏఎస్లు. అయితే హిందూ, ముస్లింకు సంబంధించిన మత సంబంధంమైన వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసి.. పోకిరీ చేష్టలకు పాల్పడ్డారు. మతపరమైన వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేశారనే ఆరోపణలపై గత నవంబర్లో ఐఏఎస్ అధికారి కె గోపాలకృష్ణన్ సస్పెండ్కు గురయ్యారు. తాజాగా తదుపరి క్రమశిక్షణా చర్య పెండింగ్లో ఉన్నందున గోపాలకృష్ణన్ను తిరిగి కేరళ ప్రభుత్వం విధుల్లోకి చేర్చుకుంది. అయితే సీనియర్ అధికారిపై వాట్సప్ గ్రూప్లో విమర్శలు చేసిన ప్రశాంత్పై మాత్రం సస్పెన్షన్ను మరో ఆరు నెలల పాటు పొడిగించింది. సస్పెన్షన్ రివ్యూ కమిటీ సూచనల మేరకు కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: KTR Meets KCR: కేసీఆర్తో కేటీఆర్ భేటీ..
గోపాలకృష్ణన్ సస్పెన్షన్ కొనసాగించడానికి ప్రాథమిక కారణం నిర్ధారణ కాలేదని సస్పెన్షన్ రివ్యూ కమిటీ తెలిపింది. దీంతో అతన్ని తిరిగి విధుల్లోకి తీసుకుంది. పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ డైరెక్టర్గా పనిచేస్తున్న గోపాలకృష్ణన్ జనవరి 9న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. అతనిపై క్రమశిక్షణా చర్యలను ఖరారు చేసే వరకు సస్పెన్షన్ను పెండింగ్లో ఉంచింది. ఇక వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమ శాఖలో పని చేసిన మాజీ ప్రత్యేక కార్యదర్శి ఎన్ ప్రశాంత్ సస్పెన్షన్ మాత్రం జనవరి 10 నుంచి మరో 120 రోజులు పొడిగించింది. ప్రశాంత్.. కేరళలో ‘కలెక్టర్ బ్రో’గా ప్రసిద్ధి చెందారు. సీనియర్ ఐఏఎస్ అధికారి జయతిలక్పై నిరాధారమైన ఆరోపణలను సోషల్ మీడియా వేదికగా చేసి సస్పెండ్కు గురయ్యారు. ఆయన సస్పెన్షన్ను పొడిగించాలని సస్పెన్షన్ రివ్యూ కమిటీ సిఫార్సు చేయగా.. ప్రభుత్వం ఆమోదించింది.
గోపాలకృష్ణన్ వివిధ వర్గాలకు చెందిన అధికారులతో కలిసి ‘‘మల్లు హిందూ ఆఫీసర్స్’’ అనే పేరుతో వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేశారు. ఇది తీవ్ర వివాదం సృష్టించింది. అయితే తాను గ్రూప్లో అధికారులెవరినీ చేర్చుకోలేదని.. గంటల వ్యవధిలోనే దాన్ని తొలగించినట్లు గోపాలకృష్ణన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ప్రశాంత్.. జయతిలక్ను మానసిక రోగిగా అభివర్ణించారు. ఇలా ఇద్దరు వివాదంలో ఇరుక్కుని వేటుకు గురయ్యారు.
ఇది కూడా చదవండి: Fun Bucket Bhargav: మైనర్ బాలికపై లైంగిక దాడి కేసు.. ఫన్ బకెట్ భార్గవ్కు 20 ఏళ్ల శిక్ష
తాజావార్తలు
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
-
TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
-
Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!