Kerala High Court: మలయాళ యాక్టర్ దిలీప్ శబరిమల వీఐపీ దర్శనం..హైకోర్టు ఆగ్రహం..
- వివాదాస్ప నటుడు దిలీప్కి శబరిమలలో వీఐపీ దర్శనం..
- సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలడంపై హైకోర్టు ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala High Court: మలయాళంలో వివాదాస్పద నటుడు, 2017లో నటి లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న యాక్టర్ దిలీప్ శబరిమల దర్శనం వివాదాస్పదమైంది. నటుడు దిలీప్కు శబరిమల దర్శన సమయంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టిడిబి), రాష్ట్ర పోలీసులు ‘వీఐపీ’ ట్రీట్మెంట్ ఇవ్వడంపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీఐపీ దర్శన సమయంలో ఎంత మంది సాధారణ భక్తులు వేచి ఉన్నారు..?పోలీసులు ఎస్కార్ట్లతో సహా దిలీప్ ప్రత్యేక ప్రవేశానికి ఎలా అనుమతించాలని శుక్రవారం కోర్టు ప్రశ్నించింది.
Read Also: Nobel Prize: మహ్మద్ యూనస్ ‘‘హిందువుల కసాయి’’.. నోబెల్ అవార్డుని పున:పరిశీలించాలి..
Also Read
- BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
- Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
- Antivenom: ఇక డోంట్ వర్నీ.. పామువిషానికి చెక్ పెట్టే సరికొత్త యాంటీవెనమ్ వచ్చేసింది!
‘‘పోలీస్ ఎస్కార్ట్తో దర్శనం ఎలా పొందుతున్నారు..? వీఐపీ దర్శనం వల్ల లైన్లో ఉన్న ఇతర భక్తుల దర్శనానికి అంతరాయం కలుగదా… క్యూల్లోనే పిల్లలు, మహిళలు గంటల తరబడి వేచి ఉన్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. యాత్రికులు, ముఖ్యంగా చిన్నారులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల దర్శనానికి ఆటంకం కలిగించేలా ఇలాంటి ఘటనలు జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీబీని కోర్టు ఆదేశించింది. సోమవారంలోగా నివేదిక సమర్పించాలని, సన్నిధానం ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీని సమీక్ష కోసం సమర్పించాలని అధికారుల్ని ఆదేశించింది.
దిలీప్ సందర్శన కారనంగా శబరిమల వద్ద యాత్రికుల రాకపోకలకు అంతరాయం కలిగిందని స్పెషల్ కమిషనర్ నివేదిక తర్వాత కోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది. రద్దీగా ఉండే మండల మకరవిళక్కు పండగ సీజన్లో ప్రముఖులకు ప్రాధాన్యత ఇవ్వడం కొనసాగినట్లయితే కోర్టు ధిక్కార చర్యలు ప్రాంరభమవుతాయని కోర్టు హెచ్చరించింది. హోదాతో సంబంధం లేకుండా భక్తులందరినీ సమానంగా చూడాలని అందరికి ఒకే ప్రక్రియ ద్వారా వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా దర్శనం కల్పించాలని చెప్పింది. కోర్టు విమర్శలపై టీడీబీ ప్రెసిడెంట్ పీఎస్ ప్రశాంత్ స్పందిస్తూ, దీనిపై విజిలెన్స్ ఎస్పీ విచారణ జరుగుతున్నట్లు చెప్పారు. దిలీప్ విషయంలో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తీసుకుంటామని అన్నారు.
తాజావార్తలు
-
Lala Amarnath: భారత్కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
-
BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
-
Bank Strike 2026: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్..
-
Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
-
Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!