Kerala High Court: మలయాళ యాక్టర్ దిలీప్ శబరిమల వీఐపీ దర్శనం..హైకోర్టు ఆగ్రహం..
- వివాదాస్ప నటుడు దిలీప్కి శబరిమలలో వీఐపీ దర్శనం..
- సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలడంపై హైకోర్టు ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala High Court: మలయాళంలో వివాదాస్పద నటుడు, 2017లో నటి లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న యాక్టర్ దిలీప్ శబరిమల దర్శనం వివాదాస్పదమైంది. నటుడు దిలీప్కు శబరిమల దర్శన సమయంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టిడిబి), రాష్ట్ర పోలీసులు ‘వీఐపీ’ ట్రీట్మెంట్ ఇవ్వడంపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీఐపీ దర్శన సమయంలో ఎంత మంది సాధారణ భక్తులు వేచి ఉన్నారు..?పోలీసులు ఎస్కార్ట్లతో సహా దిలీప్ ప్రత్యేక ప్రవేశానికి ఎలా అనుమతించాలని శుక్రవారం కోర్టు ప్రశ్నించింది.
Read Also: Nobel Prize: మహ్మద్ యూనస్ ‘‘హిందువుల కసాయి’’.. నోబెల్ అవార్డుని పున:పరిశీలించాలి..
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
‘‘పోలీస్ ఎస్కార్ట్తో దర్శనం ఎలా పొందుతున్నారు..? వీఐపీ దర్శనం వల్ల లైన్లో ఉన్న ఇతర భక్తుల దర్శనానికి అంతరాయం కలుగదా… క్యూల్లోనే పిల్లలు, మహిళలు గంటల తరబడి వేచి ఉన్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. యాత్రికులు, ముఖ్యంగా చిన్నారులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల దర్శనానికి ఆటంకం కలిగించేలా ఇలాంటి ఘటనలు జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీబీని కోర్టు ఆదేశించింది. సోమవారంలోగా నివేదిక సమర్పించాలని, సన్నిధానం ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీని సమీక్ష కోసం సమర్పించాలని అధికారుల్ని ఆదేశించింది.
దిలీప్ సందర్శన కారనంగా శబరిమల వద్ద యాత్రికుల రాకపోకలకు అంతరాయం కలిగిందని స్పెషల్ కమిషనర్ నివేదిక తర్వాత కోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది. రద్దీగా ఉండే మండల మకరవిళక్కు పండగ సీజన్లో ప్రముఖులకు ప్రాధాన్యత ఇవ్వడం కొనసాగినట్లయితే కోర్టు ధిక్కార చర్యలు ప్రాంరభమవుతాయని కోర్టు హెచ్చరించింది. హోదాతో సంబంధం లేకుండా భక్తులందరినీ సమానంగా చూడాలని అందరికి ఒకే ప్రక్రియ ద్వారా వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా దర్శనం కల్పించాలని చెప్పింది. కోర్టు విమర్శలపై టీడీబీ ప్రెసిడెంట్ పీఎస్ ప్రశాంత్ స్పందిస్తూ, దీనిపై విజిలెన్స్ ఎస్పీ విచారణ జరుగుతున్నట్లు చెప్పారు. దిలీప్ విషయంలో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తీసుకుంటామని అన్నారు.
తాజావార్తలు
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్లో భారీ హైప్
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!