Kerala High Court: మలయాళ యాక్టర్ దిలీప్ శబరిమల వీఐపీ దర్శనం..హైకోర్టు ఆగ్రహం..
- వివాదాస్ప నటుడు దిలీప్కి శబరిమలలో వీఐపీ దర్శనం..
- సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలడంపై హైకోర్టు ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala High Court: మలయాళంలో వివాదాస్పద నటుడు, 2017లో నటి లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న యాక్టర్ దిలీప్ శబరిమల దర్శనం వివాదాస్పదమైంది. నటుడు దిలీప్కు శబరిమల దర్శన సమయంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టిడిబి), రాష్ట్ర పోలీసులు ‘వీఐపీ’ ట్రీట్మెంట్ ఇవ్వడంపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీఐపీ దర్శన సమయంలో ఎంత మంది సాధారణ భక్తులు వేచి ఉన్నారు..?పోలీసులు ఎస్కార్ట్లతో సహా దిలీప్ ప్రత్యేక ప్రవేశానికి ఎలా అనుమతించాలని శుక్రవారం కోర్టు ప్రశ్నించింది.
Read Also: Nobel Prize: మహ్మద్ యూనస్ ‘‘హిందువుల కసాయి’’.. నోబెల్ అవార్డుని పున:పరిశీలించాలి..
Also Read
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
- Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
‘‘పోలీస్ ఎస్కార్ట్తో దర్శనం ఎలా పొందుతున్నారు..? వీఐపీ దర్శనం వల్ల లైన్లో ఉన్న ఇతర భక్తుల దర్శనానికి అంతరాయం కలుగదా… క్యూల్లోనే పిల్లలు, మహిళలు గంటల తరబడి వేచి ఉన్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. యాత్రికులు, ముఖ్యంగా చిన్నారులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల దర్శనానికి ఆటంకం కలిగించేలా ఇలాంటి ఘటనలు జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీబీని కోర్టు ఆదేశించింది. సోమవారంలోగా నివేదిక సమర్పించాలని, సన్నిధానం ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీని సమీక్ష కోసం సమర్పించాలని అధికారుల్ని ఆదేశించింది.
దిలీప్ సందర్శన కారనంగా శబరిమల వద్ద యాత్రికుల రాకపోకలకు అంతరాయం కలిగిందని స్పెషల్ కమిషనర్ నివేదిక తర్వాత కోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది. రద్దీగా ఉండే మండల మకరవిళక్కు పండగ సీజన్లో ప్రముఖులకు ప్రాధాన్యత ఇవ్వడం కొనసాగినట్లయితే కోర్టు ధిక్కార చర్యలు ప్రాంరభమవుతాయని కోర్టు హెచ్చరించింది. హోదాతో సంబంధం లేకుండా భక్తులందరినీ సమానంగా చూడాలని అందరికి ఒకే ప్రక్రియ ద్వారా వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా దర్శనం కల్పించాలని చెప్పింది. కోర్టు విమర్శలపై టీడీబీ ప్రెసిడెంట్ పీఎస్ ప్రశాంత్ స్పందిస్తూ, దీనిపై విజిలెన్స్ ఎస్పీ విచారణ జరుగుతున్నట్లు చెప్పారు. దిలీప్ విషయంలో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తీసుకుంటామని అన్నారు.
తాజావార్తలు
-
Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!