Nobel Prize: మహ్మద్ యూనస్ ‘‘హిందువుల కసాయి’’.. నోబెల్ అవార్డుని పున:పరిశీలించాలి..
- బంగ్లాదేశ్ అధినేత మహ్మద్ యూనస్ నోబెల్ అవార్డ్ని పరిశీలించాలి.. హిందువుల కసాయిగా మారిన మహ్మద్ యూనస్.. నోబెల్ కమిటీకి లేఖ రాసిన బీజేపీ ఎంపీ జ్యోతిర్మయి మహతో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nobel Prize: బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత, నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనస్కి ఇచ్చిన అవార్డుని సమీక్షించాలని కోరుతూ.. బెంగాల్ బీజేపీ ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ మహతో శుక్రవారం నార్వేజియన్ నోబెల్ కమిటీకి లేఖ రాశారు. ఆయన హయాంలో బంగ్లాదేశ్ హిందువుల, ఇతర మైనారిటీలపై జరుగుతున్న తీవ్ర అఘాయిత్యాలు, అకృత్యాలను పరిష్కరించాలని మహతో తన లేఖలో నోబెల్ కమిటీని కోరారు.
Read Also: Bangladesh: హిందువులపై ఆగని దాడులు.. మైనారిటీ హక్కుల సంఘం ఆందోళన..
Also Read
- Bihar: బీహార్లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్పై విడుదల
‘‘ హిందువులు, అన్యాయానికి గురైన వ్యక్తుల గురించి ప్రస్తావిస్తూ భారతమైన హృదయంతో నేను మీకు ఈ లేఖను రాస్తున్నాను. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రస్తుతం పాలనలో మైనారిటీలు అన్యాయానికి గురవుతున్నారు. మైక్రోఫైనాన్స్పై అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన డా. యూనస్ పాలనలో మానవాళికి వ్యతిరేకంగా క్రూరమైన నేరాలు జరుగుతున్నాయి. అతని పాలనలో హిందూ సమాజం భయానక పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. సామూహిక హత్యలు, టార్గెటెడ్ దాడులు జరుగుతున్నాయి. అత్యాచారాలు, మతపరమైన అణిచివేత, బెదిరింపులు, బలవంతపు వసూళ్లు, దుర్గాపూజ పండగలకు అంతరాయం ఏర్పడింది’’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ సామూహిక హత్యల వెనక సూత్రధారి మహ్మద్ యూనస్ అని లేఖలో ఆరోపించారు. నోబెల్ శాంతి బహుమతి శాంతి, న్యాయానికి విరుద్ధంగా ఉన్న వ్యక్తులకు ప్రదానం చేసినప్పుడు, దాని నైతికతను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఒకప్పుడు సంఘ సంస్కర్తగా కీర్తించిబడిని మహ్మద్ యూనస్ ‘‘హిందువుల కసాయి’’గా మారాడని, మైనారిటీలను రక్షించడంలో విఫలమయ్యారని, ఇలాంటి చర్యల్ని ప్రేరేపించే వ్యక్తికి నోబెల్ శాంతి బహుమతిని సమర్థించడం విరుద్ధమని మహతో తన లేఖలో పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
-
IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
-
Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
-
Fake Doctors: హైదరాబాద్లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
-
YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!