Karur Stampede: కరూర్ తొక్కిసలాట కేసు.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు.. విజయ్ ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి
- కరూర్ తొక్కిసలాట కేసు
- మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు
- సీఎం విజయ్ చేతుల మీదుగా నియామక పత్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ మధ్యంతర ఊరటనిచ్చింది. ఈ నియామకాలపై స్టే విధించాలన్న పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. అయితే, ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలికమని, కేసులో తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.
స్టేకు హైకోర్టు నిరాకరణ
జస్టిస్ సి.వి. కార్తికేయన్, జస్టిస్ ఆర్. శక్తివేల్లతో కూడిన ధర్మాసనం ఈ దశలో ప్రభుత్వ విధాన నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి తాము ఇష్టపడటం లేదని పేర్కొంది. పిటిషన్లపై తుది తీర్పు వచ్చే వరకు ఈ నియామకాలు తాత్కాలికంగానే కొనసాగుతాయని వెల్లడించింది. అలాగే, నియామకాలు పొందిన వారు తొలి నెల జీతం అందుకునేలోపు కేసు విచారణను పూర్తి చేయాలని కోర్టు నిర్ణయించింది. తదుపరి విచారణను జూలై 21కు వాయిదా వేసింది.
Also Read
- Meghalaya Honeymoon Murder Case: 'నేను అమాయకురాలిని, నన్ను ఇరికించారు'.. సోనమ్ సంచలన వ్యాఖ్యలు..
- Shresta Iyer: శ్రేయస్ అయ్యర్ సోదరికి అత్యాచార బెదిరింపులు.. శ్రేష్ఠ అయ్యర్ ఆవేదన
- FSSAI Liquor Notices: బీర్, విస్కీ, రమ్, తాగుతున్నారా?.. ఇది మీకోసమే..!
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది.. ఇరాన్పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
సీబీఐ, టీఎన్పీఎస్సీకి నోటీసులు
ఈ వ్యవహారాన్ని సుమోటోగా పరిశీలించిన హైకోర్టు, తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TNPSC)ను కూడా కేసులో ప్రతివాదిగా చేర్చింది. అలాగే, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కరూర్ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.
పిటిషనర్ల అభ్యంతరాలు
నామ్ తమిజార్ కట్చి (NTK) నాయకుడు తీరన్ తిరుమురుగన్, మనితానేయ జననాయక కచ్చి నాయకుడు సీని అహ్మద్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను నిలిపివేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాలు టీఎన్పీఎస్సీ వంటి చట్టబద్ధ నియామక ప్రక్రియల ద్వారా మాత్రమే ఇవ్వాలని, ఈ నిర్ణయం సమాన అవకాశాల సూత్రాన్ని దెబ్బతీస్తుందని వారు వాదించారు. అంతేకాకుండా, సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఉద్యోగాలు ఇవ్వడం వల్ల కీలక సాక్షులపై ప్రభావం పడే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
కోర్టు వ్యాఖ్యలు
విచారణ సందర్భంగా న్యాయమూర్తులు పిటిషనర్లను ప్రశ్నిస్తూ, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంలో తప్పేమిటని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అవసరం కాదా అని వ్యాఖ్యానించారు. రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి ప్రయత్నించిన పిటిషనర్లను ధర్మాసనం హెచ్చరించింది. ఇది రాజకీయ వేదిక కాదని, చట్టపరమైన అంశాలపైనే వాదనలు వినిపించాలని సూచించింది.
ప్రభుత్వ వాదనలు
రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు గతంలో కూడా ఇలాంటి సందర్భాల్లో బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చినట్లు కోర్టుకు వివరించారు. ముఖ్యంగా తూత్తుకుడి స్టెర్లైట్ కాల్పుల ఘటన తర్వాత కూడా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం శుక్రవారం నుంచే నియామక పత్రాలు జారీ చేయనున్నట్లు కూడా కోర్టుకు తెలిపింది.
సీఎం విజయ్ చేతుల మీదుగా నియామక పత్రాలు
ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ కరూర్ పర్యటనలో భాగంగా తొక్కిసలాటలో మరణించిన 41 మంది కుటుంబాలను పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా అర్హులైన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను స్వయంగా అందజేయనున్నారు.
కరూర్ తొక్కిసలాట ఘటన
గత ఏడాది సెప్టెంబరులో తమిళనాడులో జరిగిన తమిళనాడు వెట్రి కజగం (TVK) భారీ ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పిల్లలతో సహా మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు భారీగా తరలివచ్చిన నేపథ్యంలో తాగునీరు, ఆహారం, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం, జనాలను నియంత్రించడంలో లోపాలు కారణమయ్యాయని పోలీసుల నివేదిక పేర్కొంది. అయితే, ఈ ఆరోపణలను టీవీకే తీవ్రంగా ఖండించింది. ఇది పోలీసుల వైఫల్యమేనని, రాజకీయ కుట్రలో భాగంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని పార్టీ పేర్కొంది. ఈ ఘటనపై ప్రస్తుతం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ముఖ్యమంత్రి విజయ్ను ఇప్పటికే రెండుసార్లు విచారించగా, పలువురు టీవీకే నేతలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Karur Stampede: కరూర్ తొక్కిసలాట కేసు.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు.. విజయ్ ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి
-
BCCI Review: గంభీర్ భవితవ్యంపై బీసీసీఐ సమీక్ష.. షాకింగ్ నిర్ణయాలు ఏమైనా ఉంటాయా?
-
Ambati Rambabu: రావణ్పై యూఏపీఏ కేసు అన్యాయం.. పోరాటానికి మా మద్దతు
-
IND vs ENG: అతడు ఎందుకు దండగ.. ఎప్పుడో జట్టు నుంచి తప్పించాల్సింది!
-
Botsa Satyanarayana: గవర్నర్కు బొత్స లేఖ.. విశాఖలో వద్దు.. విజయనగరం మార్చండి..!
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!