Mallikarjun Kharge: కర్ణాటక తీర్పుతో “బీజేపీ ముక్త్-సౌత్ ఇండియా” అయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge: కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. విజయం అనంతరం ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు, కర్ణాటక ముఖ్య నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘బీజేపీ ముక్త్ దక్షిణ భారత్’’ అయిందని బీజేపీపై ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. కర్ణాటక అసెంబ్లీపై కాంగ్రెస్ జెండా ఎగరేశాం అని చెప్పారు. కాంగ్రెస్ ను గెలిపించినందుకు అందరికి ధన్యవాదాలు తెలిపారు. చాలా సార్లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీని అవమానపరిచిందని అన్నారు. మాది ప్రజా ప్రభుత్వం అని, ప్రజల సమస్యలను దగ్గర నుంచి చూశామని, అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పారు. ఇది ఏ ఒక్కరి విజయం కాదని, కన్నడ ప్రజల ఆశీస్సులు అని తెలిపారు. 35 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీకి 136 సీట్లు వచ్చాయని తెలిపారు. ఈ గెలుపుతో మాపై మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు.
డీకే శివకుమార్:
వ్యక్తి పూజమానుకుని పార్టీని అభిమానిద్ధాం అని కర్ణాటక పీసీసీ చీఫ్ సిద్ధరామయ్య అన్నారు. ఇది కన్నడ ప్రజల విజయం అని తెలిపారు. కర్ణాటకు మూడేళ్లుగా పట్టిన గ్రహణం వీడిందని, మా గెలుపుకు మార్గదర్శి సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలే అని తెలిపారు. ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ గెలుపని అన్నారు. మైసూర్ చాముండేశ్వరీ అమ్మవారి పాదాల సాక్షిగా నేను, సిద్ధరామయ్య ఇద్దరం కలిసి హామీలను నెరవేరుస్తామని తెలిపారు.
Also Read
- Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
సిద్ధరామయ్య:
మా క్యాబినెట్ తొలి సంతకం హామీ ఇచ్చిన 5 పథకాలపై చేస్తామని సిద్ధారామయ్య తెలిపారు. దేశాన్ని బీజేపీ అప్పుల పాలు చేసిందని, మోడీ పది సార్లు రోడ్ షోలు చేసిన జనం పట్టించుకోలేదని, కాంగ్రెస్ జనం అంచనాలను రీచ్ అవుతుందని అన్నారు.
కేసీ వేణుగోపాల్:
1977లో ఇందిరా గాంధీ ఓడిపోయినప్పుడు కూడా ఇలానే కాంగ్రెస్ పని అయిపోయిందని అంతా అన్నారు.. ఆ సమయంలో కాంగ్రెస్ ను కాపాడింది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లే అని గుర్తు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కూడా మేమే విజయం సాధిస్తాం అని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు. ఈ వయసులో కూడా ఖర్గే మాతోనే ప్రయాణం చేశారని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో ప్రచారానికి సోనియా గాంధీ వచ్చారని, ఆమె ఆశీసులతోనే విజయం సాధ్యమైందని చెప్పారు. కర్ణాటక గెలుపు దేశానికి ఓ సందేశం, కన్నడ ప్రజలు ప్రధానిని తిరస్కరించారని, 2024లో పోరాడి విజయం సాధించుకుందాం అని పిలుపునికచ్చారు.
తాజావార్తలు
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!