Mallikarjun Kharge: కర్ణాటక తీర్పుతో “బీజేపీ ముక్త్-సౌత్ ఇండియా” అయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge: కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. విజయం అనంతరం ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు, కర్ణాటక ముఖ్య నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘బీజేపీ ముక్త్ దక్షిణ భారత్’’ అయిందని బీజేపీపై ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. కర్ణాటక అసెంబ్లీపై కాంగ్రెస్ జెండా ఎగరేశాం అని చెప్పారు. కాంగ్రెస్ ను గెలిపించినందుకు అందరికి ధన్యవాదాలు తెలిపారు. చాలా సార్లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీని అవమానపరిచిందని అన్నారు. మాది ప్రజా ప్రభుత్వం అని, ప్రజల సమస్యలను దగ్గర నుంచి చూశామని, అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పారు. ఇది ఏ ఒక్కరి విజయం కాదని, కన్నడ ప్రజల ఆశీస్సులు అని తెలిపారు. 35 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీకి 136 సీట్లు వచ్చాయని తెలిపారు. ఈ గెలుపుతో మాపై మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు.
డీకే శివకుమార్:
వ్యక్తి పూజమానుకుని పార్టీని అభిమానిద్ధాం అని కర్ణాటక పీసీసీ చీఫ్ సిద్ధరామయ్య అన్నారు. ఇది కన్నడ ప్రజల విజయం అని తెలిపారు. కర్ణాటకు మూడేళ్లుగా పట్టిన గ్రహణం వీడిందని, మా గెలుపుకు మార్గదర్శి సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలే అని తెలిపారు. ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ గెలుపని అన్నారు. మైసూర్ చాముండేశ్వరీ అమ్మవారి పాదాల సాక్షిగా నేను, సిద్ధరామయ్య ఇద్దరం కలిసి హామీలను నెరవేరుస్తామని తెలిపారు.
Also Read
- TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
- Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
- India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
- US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
సిద్ధరామయ్య:
మా క్యాబినెట్ తొలి సంతకం హామీ ఇచ్చిన 5 పథకాలపై చేస్తామని సిద్ధారామయ్య తెలిపారు. దేశాన్ని బీజేపీ అప్పుల పాలు చేసిందని, మోడీ పది సార్లు రోడ్ షోలు చేసిన జనం పట్టించుకోలేదని, కాంగ్రెస్ జనం అంచనాలను రీచ్ అవుతుందని అన్నారు.
కేసీ వేణుగోపాల్:
1977లో ఇందిరా గాంధీ ఓడిపోయినప్పుడు కూడా ఇలానే కాంగ్రెస్ పని అయిపోయిందని అంతా అన్నారు.. ఆ సమయంలో కాంగ్రెస్ ను కాపాడింది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లే అని గుర్తు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కూడా మేమే విజయం సాధిస్తాం అని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు. ఈ వయసులో కూడా ఖర్గే మాతోనే ప్రయాణం చేశారని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో ప్రచారానికి సోనియా గాంధీ వచ్చారని, ఆమె ఆశీసులతోనే విజయం సాధ్యమైందని చెప్పారు. కర్ణాటక గెలుపు దేశానికి ఓ సందేశం, కన్నడ ప్రజలు ప్రధానిని తిరస్కరించారని, 2024లో పోరాడి విజయం సాధించుకుందాం అని పిలుపునికచ్చారు.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!