Karnataka Elections: “నా కులం చూసే టికెట్ ఇవ్వలేదు”.. బీజేపీపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Elections: కర్ణాటకలో బీజేపీ టికెట్ల వివాదం రచ్చరచ్చ అవుతోంది. మంగళవారం రోజు 189 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. అయితే వీటిలో 52 మంది పాతవారిని కాదని కొత్త వారికి చోటు కల్పించింది. అయితే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం బీజేపీ అధిష్టానం తీరును తప్పుబడుతున్నారు. ఇప్పటికే మాజీ ఉపముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ కి టికెట్ నిరాకరించింది. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించడం హాట్ టాపిక్ గా మారింది.
Read Also: Fire Accident : హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
ఇదిలా ఉంటే తాజాగా ఉడిపి ఎమ్మెల్యే రఘుపతి భట్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పట్ల పార్టీ వ్యవహరించిన తీరును చూస్తే చాలా బాధేస్తోందని అన్నారు. ఉడిపిలోని తన నివాసంలో విలేకరులతో భట్ మాట్లాడుతూ..‘‘పార్టీ నిర్ణయంపై నేను బాధగా లేను, కానీ పార్టీ నాతో వ్యవహరించిన తీరు నన్ను బాధించింది’’ అని కంటతడి పెట్టారు. పార్టీ నిర్ణయాన్ని తెలియజేయడానికి పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు కూడా తనకు ఫోన్ చేయలేదని, టెలివిజన్ ఛానెళ్ల ద్వారా ఈ విషయం తనకు తెలిసిందని ఆయన అన్నారు.
అమిత్ షా జగదీష్ షెట్టర్ కి ఫోన్ చేసి మార్పుల గురించి తెలియజేశారని, అయితే షా నన్ను పిలుస్తారని నేను అనుకోను కానీ కనీసం జిల్లా అధ్యక్షుడైనా ఫోన్ చేసి ఉండాల్సింది అని అన్నారు. నా కులం కారణంగా నాకు టిక్కెట్ నిరాకరిస్తే దానికి నేను అంగీకరించని అన్నారు. పార్టీ ఎదుగుదలకు అవిశ్రాంతంగా పనిచేసిన తనలాంటి వ్యక్తులు బీజేపీకి అవసరం లేదని అన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశానని, తనకు అవకాశాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ నిలబెట్టిన యశ్ పాల్ సువర్ణకు మద్దతిస్తానని అన్నారు. తదుపరి చర్యల కోసం తక్షణ నిర్ణయం ఇప్పుడేం చెప్పలేనని అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!