Karnataka Elections: ఎందుకైనా మంచిది అంబులెన్సులు సిద్ధంగా చేసుకోండి.. కాంగ్రెస్పై బీజేపీ సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మే 13న కన్నడ నాట ఎవరు అధికారం చేపడుతారో తేలబోతోంది. మెజారిటీ సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ అధికారంకి వస్తుందని, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తుందని ప్రకటించాయి. ఒకటి రెండూ మాత్రమే బీజేపీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలతో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ శ్రేణులు ఉత్సామాన్ని ఉద్దేశిస్తూ బీజేపీ నేత అమిత్ మాలవీయ వ్యంగ్యంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అంబులెన్సులు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
Read Also: Monkeypox: మంకీపాక్స్పై ఎమర్జెన్సీ ఎత్తేసిన డబ్ల్యూహెచ్ఓ
Also Read
- CJP Protest: వెనక్కి తగ్గని CJP.. ఉద్యమం కొనసాగుతుందని ప్రకటన..
- Sachin Tendulkar: "ఓటమి ఓకే కానీ మోసం నేరం”.. NEET విద్యార్థుల ఉద్యమంపై సచిన్ భావోద్వేగ సందేశం!
- Naresh Pal Gangwar: నీట్ పేపర్ లీక్ నిరసనలు.. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని తొలగించిన కేంద్రం.. కొత్త కార్యదర్శి ఎవరంటే?
- PM Modi Paper Leak Law: పేపర్ లీక్లపై కఠిన చట్టాలకు సిద్ధమైన కేంద్రం.. అర్ధరాత్రి ప్రధాని మోడీ వీడియో సందేశం
ఎగ్జిట్ పోల్స్ మఅంచనాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ గెలుపుపై ఆశాలు పెట్టుకుందని, వారి సంబరాలు చూస్తుంటే సరదాగా ఉందని, అవి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే అని నిజమైన ఫలితాలు కావని అన్నారు. కాంగ్రెస్ శ్రేణులకు నాదో సలహా.. ఎందుకైనా మంచిది అంబులెన్సులు సిద్ధం చేసుకోండి, ఎందుకంటే అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది, ఫలితాలు తారుమారు అయితే అవి మీకు ఉపయోగపడుతాయని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇక ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూసి కాంగ్రెస్ నేతలు తమకు 130 కన్నా ఎక్కువ స్థానాలు వస్తాయని చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయి నుంచి మాకు అందిన సమాచారం ప్రకారం బీజేపీకి 100 శాతం మెజారిటీ వస్తుందని సీఎం బసవరాజ్ బొమ్మై ధీమా వ్యక్తం చేశారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్ గా భావిస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 13 విడుదల అవుతాయి. 35 ఏళ్లుగా కర్ణాటకలో ఏ ప్రభుత్వం కూడా వరసగా రెండు సార్లు అధికారంలోకి రాలేదు. అయితే ఈ సారి ఆ సంప్రదాయాన్ని తిరగరాయాలని బీజేపీ భావిస్తుంటే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తామని ఆశల్లో ఉంది. ఎప్పటిలాగే హంగ్ ఏర్పడితే జేడీయూ కింగ్ మేకర్ పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉంది.
తాజావార్తలు
-
Redmi 17C 5G: రెడ్మీ 17C 5G భారత్ లో విడుదలకు రెడీ.. BISలో కనిపించిన బడ్జెట్ ఫోన్, 6000mAh బ్యాటరీ
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
CJP Protest: వెనక్కి తగ్గని CJP.. ఉద్యమం కొనసాగుతుందని ప్రకటన..
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
ట్రెండింగ్
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!