Karnataka BJP: ఆర్ఎస్ఎస్కు అనుమతి నిరాకరణ.. ఉత్తరకొరియా కిమ్లా కాంగ్రెస్ ప్రభుత్వం..
- ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి నిరాకరణ..
- కర్ణాటకలో రాజకీయ వివాదానికి కేంద్రంగా చిత్తాపూర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక చిత్తాపూర్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ర్యాలీకి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై రాజకీయ వివాదం రాజుకుంది. శాంతిభద్రతల సమస్యను పేర్కొంటూ అధికారులు అనుమతికి నిరాకరించారు. ఆర్ఎస్ఎస్కు చెందిన వ్యక్తి, సంస్థ శతాబ్ది ఉత్సవాలకు, విజయదశమి ఉత్సవం కోసం పట్టణంలో చిన్న స్థాయి ఊరేగింపు నిర్వహించడానికి అనుమతి కోరారు. దీనికి పోలీసుల నుంచి నిరాకరణ ఎదురైంది.
ఆదివారం ఆర్ఎస్ఎస్ మార్చ్కు అనుమతి కోరిన అదే మార్గంలో భీమ్ ఆర్మీ,భారతీయ దళిత్ పాంథర్ (R) సంఘ్ కూడా తమ సొంత ఊరేగింపులను నిర్వహించడానికి అనుమతి కోరాయని పోలీసు నివేదికలు చెబుతున్నాయి. ఏకకాలంలో ఊరేగింపులు జరిగితే ప్రజాశాంతికి భంగం కలిగే అవకాశం ఉందని పోలీస్ నిఘా సూచించింది. చిత్తాపూర్ ఎమ్మెల్యే, కర్ణాటక మంత్రి అయిన ప్రియాంక్ ఖర్గేను ఇటీవల ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త దుర్భాషలాడి చంపుతానని బెదిరించడం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెంచింది.
Also Read
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
Read Also: Hyderabad Metro Scare: మూసాపేట మెట్రో స్టేషన్లో బుల్లెట్ కలకలం!
ఇదిలా ఉంటే, ఈ వివాదంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. గతంలో బీజేపీ ప్రభుత్వమే ఏదైనా ప్రైవేట్ సంస్థ, సంఘం, వ్యక్తుల సమూహం ప్రభుత్వ ఆస్తిని లేదా ప్రాంగణాన్ని ఉపయోగించుకోవడానికి ముందస్తు అనుమతి తప్పనిసరి చేసిందని సీఎం గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ను టార్గెట్ చేయడం లేదని, బీజేపీ ఎల్లప్పుడూ రాజకీయం చేస్తూనే ఉంటుందని, పేదల కోసం ఏం చేయదని ఆయన అన్నారు.
అయితే, అనుమతి నిరాకరించడంపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి నిరాకరించడం ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ నిరంకుశ పాలనను గుర్తు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఒకప్పుడు దేశంపై అత్యవసర పరిస్థితిని విధించిన కాంగ్రెస్ పార్టీ చీకటి చరిత్ర పట్ల మంత్రి ప్రియాంక్ ఖర్గేకు చాలా అభిమానం ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే బహుశా ఆయన చిట్టాపూర్ను పరీక్షా స్థలంగా ఉపయోగించి కలబురగి జిల్లాలో అత్యవసర పరిస్థితి లాంటి పరిపాలనను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.’’ అని రాష్ట్ర బీజేపీ చీఫ్ విజయేంద్ర యెడియూరప్ప విమర్వించారు.
తాజావార్తలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!