Karnataka: కాంగ్రెస్ హామీ ఇచ్చింది.. కరెంట్ బిల్లులు కట్టం, బస్సులో టికెట్ తీసుకోం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల కోసం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 224 సీట్లకు గానూ 135 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. అయితే ఈ గెలుపులో కాంగ్రెస్ ప్రకటించిన 5 హామీలు చాలా కీలకంగా మారాయి. 200 యూనిట్లలోపు విద్యుత్ ఉచితంతో పాటు, ప్రభుత్వ రవాణా వ్యవస్థలో మహిళలకు ఉచితంగా ప్రయాణం వంటి హామీలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి ప్రజలు ఈ హామీల కోసం డిమాండ్ చేస్తున్నారు.
Read Also: AI face-swapping: AI ఫేస్-స్వాపింగ్ టెక్నాలజీతో భారీ మోసం.. స్నేహితుడిలా నటించి రూ.5 కోట్లకు టోకరా..
Also Read
- Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- UPI: యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన..సామాన్యులకు ఊరట..
గ్రామాల్లో కరెంట్ బిల్లుల వసూలు చేసేందుకు వచ్చే విద్యుత్ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. మాకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది, వారే మా బిల్లులు కడుతారని ప్రజలు చెబుతున్నారు. బెళగావిలోని ఓ గ్రామంలో కొందరు వ్యక్తులు కరెంటు బిల్లులు చెల్లించేందుకు నిరాకరించారు. కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చిందని ప్రజలు చెబుతున్నారు. కొప్పల్, కలబురగి, చిత్రదుర్గ జిల్లాల్లోని గ్రామస్థులు కూడా విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే కొప్పల్ ప్రాంతంలో గత 6 నెలలుగా రూ.9000 విద్యుత్ బిల్లు కట్టాలని కోరిన విద్యుత్ ఉద్యోగులపై ఆ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదిలా ఉంటే రాయచూర్ లో ఓ మహిళ బస్సులో టికెట్ తీసుకునేందుకు నిరాకరించింది. టికెట్ కోసం డబ్బులు ఇవ్వకపోవడంతో సదరు మహిళ బస్సు కండక్టర్తో వాగ్వాదానికి దిగింది. బస్సు టికెట్ కొనడానికి నిరాకరించిన మహిళ.. మేము డబ్బులు చెల్లించాల్సి వస్తే కాంగ్రెస్ ఎందుకు ఉచితం అని ప్రకటించింది..? అని ప్రశ్నించింది. మస్కీ-సింథనూర్ బస్సులో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ ప్రకటించిన హామీలను అమలు చేస్తే ఏటా రూ.50,000 కోట్ల ఖజానాకు బొక్కపడుతుంది.
Women strongly argues with bus conductor in Karnataka, says she will not buy ticket.
"If we have to pay money, why did they announce its free, are they mad".pic.twitter.com/WyLhF4XRuj— Dr AishwaryaS (@Aish17aer) May 23, 2023
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!