Congress: కర్ణాటక కాంగ్రెస్లో కోల్డ్వార్.. కేపీసీసీ పోస్టుపై కొనసాగుతున్న ఉత్కంఠ!
- కర్ణాటక కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్వార్..
- డీకే శివకుమార్- సతీష్ జార్కిహొళి మధ్య మాటల యుద్ధం..
- కేపీసీసీ పోస్టుపై కొనసాగుతున్న ఉత్కంఠ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కర్ణాటక కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. కేపీసీసీ అధ్యక్షు పదవీపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో మరో మంత్రి మాటల యుద్ధానికి దిగారు. నాయకులు ఇష్టానుసారం మాట్లాడరాదని ఇటీవలే హైకమాండ్ ఆదేశించినా పట్టించుకునే పరిస్థితి అక్కడ కనపడటం లేదు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. కేపీసీసీ అధ్యక్ష పదవీ మార్కెట్లో దొరకదన్నారు. మనం పార్టీకి చేసిన సేవలు, శ్రమను గుర్తించి సరైన పదవి ఇస్తారని తెలిపారు. కానీ, కొందరు మాత్రం మీడియా ముందుకు వచ్చి పదవి కావాలని అడుగుతున్నారని డీకే శివకుమార్ అన్నారు.
Read Also: Venky : సంక్రాంతికి వచ్చాడు.. వంద కోట్లు రాబట్టాడు
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
ఇక, పార్టీలో అందరూ క్రమశిక్షణతో ఉండాలని రాహుల్ గాంధీ, సీఎం సిద్దరామయ్య సూచించారని డీకే శివ కుమార్ తెలిపారు. పార్టీని నేనొక్కడే కాదు, కార్యకర్తలు, ప్రజలు కలిసి గెలిపించారని చెప్పుకొచ్చారు. అలాగే, జై భీమ్ సమావేశాల నిర్వహణ పరిశీలనకు ఇన్చార్జి సుర్జేవాలా ఈరోజు (జనవరి 17) బెళగావికి వస్తున్నారని పేర్కొన్నారు. మీరు ప్రశ్నలు ఏమైనా ఉంటే ఆయనను అడగాలని నేతలకు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ సూచించారు.
Read Also: Padi kaushik Reddy: పోలీసులు 32 ప్రశ్నలు సంధించారు.. అన్నింటికీ సమాధానం చెప్పా!
మరోవైపు, కేపీసీసీ నుంచి నోటీసులు అందుకున్న మంత్రి సతీష్ జార్కిహొళి మాట్లాడుతూ.. ఆ నోటీసులు ఇచ్చినప్పటికీ ఏం కాదన్నారు. దీనికి స్పష్టమైన సమాధానం అధ్యక్షుడికి ఇస్తానన్నారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఉన్నానని నేను ఎక్కడా చెప్పలేదు.. ఇక, తన మాటల వల్ల ఎవరికీ ఇబ్బంది కలగలేదు.. నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన తెలిపారు. అయితే, కాంగ్రెస్లో ప్రస్తుత పరిణామాలపై భారతీయ జనతా పార్టీ సెటైరికల్ కామెంట్స్ చేసింది. కాంగ్రెస్లో ఇలాంటివి కొత్తేమీ కాదని వెల్లడించింది.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!