Karnataka: ముగిసిన సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పదవీకాలం.. 50 శాతం మంత్రులను తొలగించే ఛాన్స్
- కర్ణాటకలో అధికార మార్పిడిపై కొనసాగుతున్న ఊహాగానాలు..
- త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఏఐసీసీ సూచనలు..
- ఈ నెల 13న కేబినెట్ మంత్రులకు సీఎం సిద్ధరామయ్య విందు భోజనాలు..
- అధికార మార్పిడి గురించి నాకు తెలియదు, ఇది సీఎంకే తెలుసు: డీకే శివకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్టోబర్ 13వ తేదీన అన్ని కేబినెట్ మంత్రులకు విందు ఇస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్తో జరిగిన చర్చల సందర్భంగా, ముఖ్యమంత్రి తన పదవీకాలం 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత నవంబర్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని సూచనలు చేసినట్లు తెలుస్తుంది. కాగా, ప్రస్తుత మంత్రులలో 50 శాతం మందిని తొలగించి కొత్తవారిని తీసుకురావాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. నవంబర్లో దాదాపు 15 మంది కొత్త మంత్రులను తీసుకుని సీఎంని వెంటనే మార్చడం హైకమాండ్కు కష్టమవుతుందని పార్టీ అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే కొత్త మంత్రివర్గం ఇప్పటికే అమల్లో ఉంది. బీహార్ ఎన్నికల తర్వాత వ్యూహాత్మకంగా ప్రణాళిక చేయబడిన ఈ పునర్వ్యవస్థీకరణ, నాయకత్వ మార్పు నిర్ణయాలకు ముందే పార్టీలో ముఖ్యమంత్రి స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి సిద్ధరామయ్య ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
Read Also: రోడ్డుమార్గాన నర్సీపట్నానికి జగన్, పోలీసులు నిర్దేశించిన అనకాపల్లి,పెందుర్తి మీదుగా పర్యటన
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
అయితే, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ.. అలాంటి సమాచారం నాకు తెలియదు, ఈ అంశం పూర్తిగా సీఎంకి వదిలివేయబడింది.. మనమందరం పార్టీ కోసం పనిచేస్తాం.. నేను దేంట్లోనూ జోక్యం చేసుకోను, నేను కేవలం సూచనలు మాత్రమే ఇవ్వగలను అన్నారు. ఎవరూ గందరగోళం సృష్టించకూడదు అని సూచించారు. కాగా, కర్ణాటకలో నాయకత్వ మార్పు గురించి కాంగ్రెస్ పార్టీలోనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. 2.5 సంవత్సరాల తర్వాత నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉందని కొందరు నేతలు సూచించడంతో, సిద్ధరామయ్య పదవీకాలం గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!