Karnataka: ముగిసిన సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పదవీకాలం.. 50 శాతం మంత్రులను తొలగించే ఛాన్స్
- కర్ణాటకలో అధికార మార్పిడిపై కొనసాగుతున్న ఊహాగానాలు..
- త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఏఐసీసీ సూచనలు..
- ఈ నెల 13న కేబినెట్ మంత్రులకు సీఎం సిద్ధరామయ్య విందు భోజనాలు..
- అధికార మార్పిడి గురించి నాకు తెలియదు, ఇది సీఎంకే తెలుసు: డీకే శివకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్టోబర్ 13వ తేదీన అన్ని కేబినెట్ మంత్రులకు విందు ఇస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్తో జరిగిన చర్చల సందర్భంగా, ముఖ్యమంత్రి తన పదవీకాలం 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత నవంబర్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని సూచనలు చేసినట్లు తెలుస్తుంది. కాగా, ప్రస్తుత మంత్రులలో 50 శాతం మందిని తొలగించి కొత్తవారిని తీసుకురావాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. నవంబర్లో దాదాపు 15 మంది కొత్త మంత్రులను తీసుకుని సీఎంని వెంటనే మార్చడం హైకమాండ్కు కష్టమవుతుందని పార్టీ అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే కొత్త మంత్రివర్గం ఇప్పటికే అమల్లో ఉంది. బీహార్ ఎన్నికల తర్వాత వ్యూహాత్మకంగా ప్రణాళిక చేయబడిన ఈ పునర్వ్యవస్థీకరణ, నాయకత్వ మార్పు నిర్ణయాలకు ముందే పార్టీలో ముఖ్యమంత్రి స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి సిద్ధరామయ్య ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
Read Also: రోడ్డుమార్గాన నర్సీపట్నానికి జగన్, పోలీసులు నిర్దేశించిన అనకాపల్లి,పెందుర్తి మీదుగా పర్యటన
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
అయితే, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ.. అలాంటి సమాచారం నాకు తెలియదు, ఈ అంశం పూర్తిగా సీఎంకి వదిలివేయబడింది.. మనమందరం పార్టీ కోసం పనిచేస్తాం.. నేను దేంట్లోనూ జోక్యం చేసుకోను, నేను కేవలం సూచనలు మాత్రమే ఇవ్వగలను అన్నారు. ఎవరూ గందరగోళం సృష్టించకూడదు అని సూచించారు. కాగా, కర్ణాటకలో నాయకత్వ మార్పు గురించి కాంగ్రెస్ పార్టీలోనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. 2.5 సంవత్సరాల తర్వాత నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉందని కొందరు నేతలు సూచించడంతో, సిద్ధరామయ్య పదవీకాలం గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!