All Set for Voting: 3 రాష్ట్రాల్లో పోలింగ్ కు సర్వం సిద్ధం..!
- మూడు రాష్ట్రాల్లో పోలింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- కేరళలో ఎల్డీఎఫ్ vs యుడిఎఫ్ vs బీజేపీ హోరాహోరీ
- భద్రతకు భారీ బందోబస్తు… సున్నిత కేంద్రాల్లో సీఆర్పీఎఫ్ మోహరింపు
- నగదు స్వాధీనం, ముందస్తు అరెస్టులతో అప్రమత్తమైన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా రాజకీయ వేడి పెంచుతున్న కేరళ, అస్సాం , కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల పోలింగ్కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు (ఏప్రిల్ 9) ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ముఖ్యంగా కేరళలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఎల్డీఎఫ్ (LDF), ఎలాగైనా పీఠాన్ని దక్కించుకోవాలని యుడిఎఫ్ (UDF) , సత్తా చాటాలని బిజెపి (BJP) కూటములు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కేరళలోని 140 అసెంబ్లీ స్థానాల కోసం మొత్తం 883 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, సుమారు 2 కోట్ల 71 లక్షల మంది ఓటర్లు తమ తీర్పును ఇవ్వబోతున్నారు. ఇప్పటికే వృద్ధులు , దివ్యాంగులకు సంబంధించిన ‘హోమ్ ఓటింగ్’ ప్రక్రియను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు.
Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?
Also Read
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
- Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 30,471 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన అధికారులు, భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ‘జనమైత్రి’ పేరుతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సుమారు 76,000 మంది పోలీసు సిబ్బందిని విధుల్లో నియమించడమే కాకుండా, శబరిమల వంటి అటవీ ప్రాంతాల నుంచి రాజధాని త్రివేండ్రం వరకు ఉన్న 2,500 సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో సీఆర్పీఎఫ్ (CRPF) బలగాలను మోహరించారు. ఈ ఎన్నికల్లో మహిళా ప్రాధాన్యతను చాటుతూ 352 పోలింగ్ కేంద్రాలను పూర్తిగా మహిళా అధికారులే పర్యవేక్షించనున్నారు. అలాగే 37 కేంద్రాలను ప్రత్యేకంగా దివ్యాంగుల నిర్వహణలో ఉంచడం విశేషం.
Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్కు గుడ్బై..! ఈ సింపుల్ టిప్స్తో వంటగది కూల్గా మార్చుకోండి.!
ఎన్నికల నిబంధనల అమలులో భాగంగా పోలీసులు జరిపిన ముమ్మర తనిఖీల్లో ఇప్పటివరకు సుమారు 47 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. గత ప్రచార సమయంలో ఘర్షణలు చోటుచేసుకున్న త్రిసూర్, పాలక్కాడ్ , కన్నూరు జిల్లాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు వందల సంఖ్యలో ముందస్తు అరెస్టులు చేపట్టారు. అస్సాం , పుదుచ్చేరిలో కూడా పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు సాయంత్రం లోపు ఈ మూడు ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది, దీంతో అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది.
తాజావార్తలు
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
-
Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్కు చెక్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!