Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
- బెంగాల్లో టీఎంసీ ఎంపీలపై దాడులు
- దాడులపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ తీవ్ర వ్యాఖ్యలు
- భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉందని వ్యా్ఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీలపై జరిగిన దాడులపై రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఇలాంటి ఘటనలు జరిగే దేశంలో జీవిస్తున్నందుకు నాకు సిగ్గుగా ఉంది” అని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు.
ఇటీవల సోనార్పూర్ పర్యటనలో అభిషేక్ బెనర్జీపై కొందరు వ్యక్తులు రాళ్లు, గుడ్లు విసిరి దుర్భాషలాడిన ఘటన చోటుచేసుకుంది. ఆ తర్వాతి రోజు హూగ్లీ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ ఎదుట కల్యాణ్ బెనర్జీని కూడా కొందరు అడ్డుకుని వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలపై స్పందించిన కపిల్ సిబల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇది పూర్తిగా సిగ్గుచేటు. ఈ దేశంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ప్రజాస్వామ్య పునాదులను ధ్వంసం చేయడానికి ఏ స్థాయికైనా వెళ్తోంది. ఇలాంటి పరిస్థితులు ఉన్న దేశంలో జీవిస్తున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
బీజేపీ మండిపాటు
కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. ‘‘భారత సుప్రీంకోర్టులో వాదనలు వినిపించి కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి ఇప్పుడు భారత్లో జీవించడం సిగ్గుగా ఉందంటున్నారు” అంటూ విమర్శించారు. అలాగే 2021లో పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల్లో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు హతమైనప్పుడు కపిల్ సిబల్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటన, సందేశ్ఖాలి వంటి అంశాలపై కూడా ఎందుకు మౌనం పాటించారని ఆరోపించారు. “బీజేపీని వ్యతిరేకించడం ఒక విషయం. కానీ భారత్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రాజకీయ భేదాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ దేశాన్ని ద్వేషించడం ఎందుకు?” అంటూ పూనావాలా ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి సోనార్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. కపిల్ సిబల్ వ్యాఖ్యలు, బీజేపీ ప్రతిస్పందనతో ఈ వ్యవహారం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
#WATCH | Delhi | Over Kapil Sibal's remarks on attack on TMC MP Abhishek Banerjee, BJP National Spokesperson, Shehzad Poonawalla says, "Unfortunately, a person who has made crores of rupees by running his very successful practice in the Supreme Court of India has such a dim view… pic.twitter.com/Ax7D6A94cX
— ANI (@ANI) June 1, 2026
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!