Uttar Pradesh: గ్రామస్థులపై నక్క దాడి.. 10 ఏళ్ల బాలుడు సహా ముగ్గురికి గాయాలు
- ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో నక్కల దాడి..
- నక్కల దాడిలో గాయపడిన 10 ఏళ్ల బాలుడితో పాటు మరో ముగ్గురు..
- దాడులు చేసే నక్కలను పట్టుకుంటామని తెలిపిన అటవీ శాఖ అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రైచ్లో ఇటీవల తోడేళ్ల దాడి జరిగిన తర్వాత ఇప్పుడు కాన్పూర్ సమీపంలోని గ్రామాల్లో నక్కల దాడులు పెరిగాయి. రెండు వేర్వురు ఘటనల్లో 10 ఏళ్ల బాలుడు సహా అనేక మంది గ్రామస్తులను గాయపడ్డారు. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమైయ్యారు. మంగళవారం సాయంత్రం పొలాల్లో పని చేస్తున్న షాను, రామ్ బహదూర్లతో పాటు పదేళ్ల బాలుడిపై నక్క దాడి చేసి గాయపరిచింది. అలాగే, మరో సంఘటనలో బెహత్ సకత్ నివాసి రామ్ కిషోర్ (50)ని కూడా ఈ నక్క గాయపర్చింది అని స్థానికులు తెలిపారు.
Read Also: Gas Leak: రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్.. అల్లాడుతున్న ప్రజలు..
Also Read
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
కాగా, నక్కల దాడులు జరిగినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) పేర్కొన్నారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది అన్నారు. అధిక వర్షపాతంతో ఈ వన్యప్రాణులను వాటి సహజ ఆవాసాల నుంచి స్థానభ్రంశం కోసం సమీపంలోని గ్రామాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆయన సూచించారు. నక్కల దాడిపై జిల్లా యంత్రాంగం బాధిత ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. అయితే, బహ్రైచ్లో గత వారం రోజుల క్రితం తోడేళ్ళు 10 మందికి పైగా ప్రాణాలను బలిగొన్నాయి. చాలా మందిని తీవ్రంగా గాయపర్చాయి. ఇక, వీటిని పట్టుకునేందుకు అధికారులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఐదు తోడేళ్లను పట్టుకోగా.. ఆరవ తోడేలు దాడి చేయడంతో ప్రజల్లో మరింత భయం నెలకొంది.
తాజావార్తలు
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
-
Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
-
Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!