Kanhaiya Kumar: “తుక్డే-తుక్డే వ్యాఖ్యలు, అఫ్జల్ గురుకి మద్దతు తెలిపినందుకే కాంగ్రెస్ అభ్యర్థిపై దాడి చేశాం..
Kanhaiya Kumar: ఇండియా కూటమి తరుపున కాంగ్రెస్ అభ్యర్థిగా కన్హయ్య కుమార్ ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్నారు. శుక్రవారం కన్హయ్య ప్రచారం చేస్తుండగా, ఒక వ్యక్తి పూలమాల వేయడానికి దగ్గరగా వచ్చి అతని చెంపపై కొట్టాడు. ఈ వీడియో వైరల్గా మారింది. కన్హయ్యతో పాటు ఆప్ మహిళా కౌన్సిలర్పై అనుచితంగా ప్రవర్తించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, దాడికి పాల్పడిన దక్ష్, అన్నూ చౌదరిలు తమ చర్యని సమర్థించుకున్నారు. 2016 జేఎన్యూలో కన్హయ్య చేసిన ప్రసంగం విన్న తర్వాత అతడి చెంపపై కొట్టాలని నిర్ణయించుకన్నామని వారిద్దరు వెల్లడించారు. తమకు ఏ రాజకీయ పార్టీలో సంబంధం లేని వారు చెప్పారు.
నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిందితులు ఈ విషయాన్ని వెల్లడించారు. జేఎన్యూలో కన్హయ్య కుమార్ చేసిన ప్రసంగం విన్న రోజే అతడిని చెంపదెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నానని, పార్లమెంట్ దాడి నిందితుడు అప్జల్ గురుకు మద్దతుగా నినాదాలు చేశాడని, భారత సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడని వారు గుర్తు చేశారు. ‘‘భారత్ తేరే తుక్డే హోంగే’’ (భారత్ను ముక్కలుగా ముక్కలు చేస్తాం) అనే నినాదాన్ని కన్హయ్య లేవనెత్తారు, భారత సైన్యం మహిళపై అత్యాచారాలు చేస్తుందని అబద్ధాలు చెప్పాడు, ఆ సమయమే అతడికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నట్లు నిందితులు తెలిపారు.
Also Read
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
Read Also: Suriya Kanguva: 10,000 మందితో ఆ ఒక్క వార్ సీన్.. గూస్ బంప్స్ పక్కా..
పథకం ప్రకారమే కన్హయ్య కుమార్పై దాడి చేసినట్లు గోసంరక్షకులైన దక్ష్, అన్నూ తెలిపారు. తాము పశ్చాత్తాపం చెందడం లేదని, దేశాన్ని రక్షించడానికి, అలాంటి ద్రోహులకు గుణపాఠం చెప్పడానికి దాడి చేశామని అన్నారు. మేము అతడిని చెంపదెబ్బ కొట్టడానికి, సిరా వేయడానికి మాత్రమే వెళ్లామని, తమకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పారు. ఎవరి సలహా మేరకు తాము ఈ పనిచేయాలని, అతడిపై దాడి చేయడం చట్టాన్ని ఉల్లంఘించినట్లు కాదని చెప్పాడు. తాము పోలీసుల ఎదుట లొంగిపోతామని వెల్లడించారు. తుక్డే తుక్డే నినాదాలు చేసి సైన్యాన్ని అవమానించిన వాడు పార్లమెంటుకు వెళ్తాడా..? అని ప్రశ్నించారు. ఇన్స్టాగ్రామ్లో దక్ష్కి 4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అన్నూకి 12,400 మంది ఫాలోవర్లు ఉన్నారు. వీరు గత మూడు నాలుగేళ్లుగా గోసంరక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. గతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలతో ఘజియాబాద్ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!