Nitish Kumar: ఎన్డీయేలోనే ఉంటా.. క్లారిటీ ఇచ్చిన నితీష్ కుమార్..
- మహాగటబంధన్లో చేరి తప్పు చేశా.. భవిష్యత్తులో మళ్లీ జరగదు..
- ఎన్డీయేలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చిన సీఎం నితీష్ కుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: బీహార్ సీఎం నితీష్ కుమార్ తాను ఎన్డీయేలో ఉంటానని తన వైఖరిని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ‘‘మహాగట్బంధన్’’లో మళ్లీ చేరబోనని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం అన్నారు. ఉన్నత స్థాయి ఎన్డీయే సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే నాయకుడు 2025లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోనే పోరాడుతామని ప్రకటించారు. మహాగటబంధన్తో పొత్తు పెట్టుకోవడంపై మాట్లాడుతూ.. తన పార్టీ సీనియర్ నాయకుల సలహా వల్ల చేసిన తప్పులుగా అభివర్ణించారు. ఆయితే ఆయన ఏ ఒక్కరి పేరు చెప్పలేదు.
Read Also: AP: పేదల ఇళ్ల నిర్మాణానికి స్థల వితరణకు ముందుకొచ్చిన ఓ వృద్ధురాలు.. సీఎం అభినందనలు
Also Read
- MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
- Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
వచ్చే ఎన్నికల్లో సమిష్టిగా ఎన్డీయే కూటమి 220 సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు. వ్యక్తిగత పార్టీల కన్నా ఐక్యంగా పనిచేయాలనే ప్రాముఖ్యతని నొక్కిచెప్పారు. పంచాయతీ, బ్లాక్ స్థాయిలో ఇలాంటి సమావేశాలను నిర్వహించడం వల్ల ఎన్డీయే నాయకులు మరింత క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయాలని నితీష్ కుమార్ శ్రేణులకు సూచించారు. సమావేశం అనంతరం బీహార్ యూనిట్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ మాట్లాడుతూ 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో ఎన్డీయే పోటీ చేస్తుందని చెప్పారు. 2020 ఎన్నికల్లో గెలిచే సీట్ల సంఖ్యను అధిగమించాలని ఎన్డీయే ప్రతిష్టాత్మకంగా పెట్టుకుందని దిలీస్ జైశ్వాల్ అన్నారు.
మహాకూటమి బీహార్ ప్రజలను తప్పుదోవ పట్టించి మోసం చేసిందని, ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న తప్పుడు సమాచారాన్ని చురుగ్గా ఎదుర్కోవాలని నితీష్ కుమార్ ఎన్డిఎ నాయకులను కోరారు. ఎన్డీయే విస్తరణని బలోపేతం చేయడానికి నితీష్ కుమార్ రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ స్థాయి సమావేశాలతో కూడిన వ్యూహాన్ని వివరించారు. భవిష్యత్తులో కార్యక్రమాలను కూటమి నేతలు సమన్వయంతో, భాగస్వామ్యంతో చేయాలని సూచించారు. బీహార్లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే వేళ ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాజావార్తలు
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!