Nitish Kumar: ఎన్డీయేలోనే ఉంటా.. క్లారిటీ ఇచ్చిన నితీష్ కుమార్..
- మహాగటబంధన్లో చేరి తప్పు చేశా.. భవిష్యత్తులో మళ్లీ జరగదు..
- ఎన్డీయేలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చిన సీఎం నితీష్ కుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: బీహార్ సీఎం నితీష్ కుమార్ తాను ఎన్డీయేలో ఉంటానని తన వైఖరిని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ‘‘మహాగట్బంధన్’’లో మళ్లీ చేరబోనని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం అన్నారు. ఉన్నత స్థాయి ఎన్డీయే సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే నాయకుడు 2025లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోనే పోరాడుతామని ప్రకటించారు. మహాగటబంధన్తో పొత్తు పెట్టుకోవడంపై మాట్లాడుతూ.. తన పార్టీ సీనియర్ నాయకుల సలహా వల్ల చేసిన తప్పులుగా అభివర్ణించారు. ఆయితే ఆయన ఏ ఒక్కరి పేరు చెప్పలేదు.
Read Also: AP: పేదల ఇళ్ల నిర్మాణానికి స్థల వితరణకు ముందుకొచ్చిన ఓ వృద్ధురాలు.. సీఎం అభినందనలు
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
వచ్చే ఎన్నికల్లో సమిష్టిగా ఎన్డీయే కూటమి 220 సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు. వ్యక్తిగత పార్టీల కన్నా ఐక్యంగా పనిచేయాలనే ప్రాముఖ్యతని నొక్కిచెప్పారు. పంచాయతీ, బ్లాక్ స్థాయిలో ఇలాంటి సమావేశాలను నిర్వహించడం వల్ల ఎన్డీయే నాయకులు మరింత క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయాలని నితీష్ కుమార్ శ్రేణులకు సూచించారు. సమావేశం అనంతరం బీహార్ యూనిట్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ మాట్లాడుతూ 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో ఎన్డీయే పోటీ చేస్తుందని చెప్పారు. 2020 ఎన్నికల్లో గెలిచే సీట్ల సంఖ్యను అధిగమించాలని ఎన్డీయే ప్రతిష్టాత్మకంగా పెట్టుకుందని దిలీస్ జైశ్వాల్ అన్నారు.
మహాకూటమి బీహార్ ప్రజలను తప్పుదోవ పట్టించి మోసం చేసిందని, ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న తప్పుడు సమాచారాన్ని చురుగ్గా ఎదుర్కోవాలని నితీష్ కుమార్ ఎన్డిఎ నాయకులను కోరారు. ఎన్డీయే విస్తరణని బలోపేతం చేయడానికి నితీష్ కుమార్ రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ స్థాయి సమావేశాలతో కూడిన వ్యూహాన్ని వివరించారు. భవిష్యత్తులో కార్యక్రమాలను కూటమి నేతలు సమన్వయంతో, భాగస్వామ్యంతో చేయాలని సూచించారు. బీహార్లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే వేళ ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..