Modi- Biden: ఈ నెల 21న ప్రధాని మోడీ- జో బైడెన్ కీలక భేటీ..
- అమెరికాలో కొనసాగుతున్న ఎన్నికల హీట్..
- ఈ నెల 21వ తేదీన డెలావర్లోని విల్మింగ్టన్లో క్వాడ్ సమ్మిట్ ఏర్పాటు..
- భారత ప్రధాని నరేంద్ర మోడీతో అమెరిక అధ్యక్షుడు జో బైడెన్ భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi- Biden: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హీట్ కొనసాగుతుంది. ఎన్నికల ప్రచార ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లతో హోరెత్తిపోతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డెమోక్రాట్లు.. మరోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో రిపబ్లికన్లు పోరాడుతున్నారు. ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన అక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. వారిద్దరూ తమ ప్రచార కార్యక్రమాలు, డిబేట్లలో జోరు పెంచారు.
Read Also: Arekapudi Gandhi: ఇవాళ గాంధీ ఇంటికి వస్తానని కౌశిక్ రెడ్డి సవాల్.. పోలీసులు భారీ బందోబస్తు
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
ఈ పరిస్థితుల మధ్య అమెరికా నుంచి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం వచ్చింది. తమ దేశ పర్యటనకు రావాల్సిందిగా ప్రెసిడెంట్ బైడెన్ మోడీకి ఆహ్వానం పంపించారు. దీనికి మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, భారత ప్రధాని అమెరికా పర్యటనపై నేడు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన, షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. క్వాడ్ సభ్య దేశాల సమావేశానికి అమెరికా ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. ఈ నెల 21వ తేదీన డెలావర్లోని విల్మింగ్టన్లో ఈ సదస్సు ఏర్పాటు చేయబోతున్నారు. ఇన్- పర్సన్ క్వాడ్ సమ్మిట్ ఈ ఏడాది విల్మింగ్టన్లో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. క్వాడ్లో ఆతిథ్య అమెరికాతో పాటు భారత్, ఆస్ట్రేలియా, జపాన్లకు సభ్య దేశాలుగా ఉన్నాయి. జో బైడెన్, మోడీతో పాటు ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానమంత్రులు ఆంథోని అల్బెనీస్, ఫ్యుమియో కిషిడ ఈ సమ్మిట్కు హాజరు కాబోతున్నారు. 2021లో వైట్హౌస్లో మొట్ట మొదటి క్వాడ్ లీడర్స్ సమ్మిట్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ సమావేశం ఏర్పాటవుతూ వస్తుంది.
Read Also: Madrassas: విద్యాబోధనకు మదర్సాలు పనికిరావు..
ఇక, ఈ మధ్యకాలంలో క్వాడ్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు ఎనిమిది సార్లు భేటీ అయ్యారు. సభ్య దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంతో పాటు ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో-పసిఫిక్ రీజియన్ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆరోగ్య భద్రత, విపత్తుల నిర్వహణ, సరిహద్దుల భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, వాతావరణ మార్పులు, సైబర్ సెక్యూరిటీ లాంటి అంశాలపై ఈ సమ్మిట్ లో ప్రధానంగా చర్చించనున్నారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!