Terrorist Attack: రియాసి బస్సుపై దాడి చేసిన ఉగ్రవాదులకు పూంచ్ ఎయిర్ఫోర్స్ కాన్వాయ్ దాడితో సంబంధం..
- రియాసి - పూంచ్ ఉగ్రదాడులకు సంబంధం..
- జంగిల్ వార్ఫేర్లో ఉగ్రవాదులకు శిక్షణ..
- భారీ మ్యాన్హంట్ ప్రారంభించిన భద్రతా బలగాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorist Attack: ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసే రోజే ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూకాశ్మీర్లో రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేశారు. ఉగ్రవాదుల కాల్పులతో బస్సు నియంత్రణ తప్పి, సమీపంలోని లోయలో పడిపోయింది. ఈ దాడిలో 09 మంది మరణించారు. ఈ దాడిలో ‘జింగిల్ వార్ఫేర్’లో శిక్షణ పొందిన ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. గుహల్లో దాక్కుంటూ, ఎం4 కార్బైన్ గన్స్ వాడుతూ వీరు దాడులకు పాల్పడుతున్నారు.
రియాసి బస్సు దాడి ఘటనకు మే 4న పూంచ్లో భారతవైమానిక దళం(ఐఏఎఫ్) కాన్వాయ్ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడిన సంఘటనకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులే రియాసిలో బస్సుపై దాడికి పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. పూంచ్ అటాక్ తర్వాత టెర్రరిస్టులు అడవుల గుండా ప్రయాణించారు.
Also Read
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
- Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
Read Also: Uddhav Thackeray: కాంగ్రెస్, శరద్ పవార్పై విమర్శలు.. ఉద్ధవ్ ఠాక్రేపై బీజేపీ ప్రశంసలు..
దాడికి పాల్పడుతున్న ఉగ్రవాదులు అడవుల్లోని గుహల్లో రోజుల తరబడి నివసిస్తూ, దాడులకు పాల్పడేలా శిక్షణ తీసుకున్నారని తెలుస్తోంది. రియాసి ఘటన తర్వాత భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ ప్రారంభించింది. ఐదు భద్రతా సంస్థలు ఈ సంఘటనలో పాల్గొన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. రాజౌరి, రియాసి, పూంచ్ అనే మూడు జిల్లాలకు చెందిన భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నాయి.
నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) బాధ్యత వహించింది. ఆ తర్వాత తన ప్రకటనను ఉపసంహరించుకుంది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూ మరియు రియాసి ఆసుపత్రులలో క్షతగాత్రులను పరామర్శించారు మరియు భద్రతా పరిస్థితిని సమీక్షించడానికి ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. రియాసి ఉగ్రదాడి ఘటనలో మృతుల కుటుంబాలకు లెఫ్టినెంట్ గవర్నర్ రూ. 10 లక్షల రూపాలయ ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేలు అందచేయనున్నారు.
తాజావార్తలు
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
-
Peddi vs Drishyam : మోహన్ లాల్కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!