Woman SI Brutally Killed: మరో దారుణం.. వాహనంతో తొక్కించి మహిళా ఎస్సై హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman SI Brutally Killed: హర్యానాలో డీఎస్పీ హత్య జరిగిన కొద్ది సమయంలోనే అదే తరహాలో జార్ఖండ్లో మహిళా ఎస్సై దారుణంగా హత్యకు గురైంది. రాంచీలో నేరస్థులు ఓ మహిళా ఎస్సైని దారుణంగా హత్య చేశారు. వాహనంతో ఢీకొట్టి చంపేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో గత రాత్రి సంధ్యా టోప్నో అనే మహిళా సబ్-ఇన్స్పెక్టర్ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా హత్యకు గురికాగా.. ఆ తర్వాత పోలీసులు ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేశారు.
మృతురాలు సంధ్యా టోప్నో తుపుదానా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి ఓ చెక్పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సంధ్య.. దారిలో వెళ్తున్న ఓ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులను పట్టించుకోకుండా నిందితులు.. వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. ఈ క్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ సంధ్యపై నుంచి వాహనం దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను రిమ్స్కు తరలించగా.. అక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
ఎస్సై సంధ్య వాహనంలో పశువులను తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఆపడానికి ప్రయత్నించిందని.. డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా ఆమె పైకి వాహనాన్ని ఎక్కించి మరణానికి కారణమయ్యాయడని రాంచీ సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కౌశల్ కిషోర్ వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది. హర్యానాలోని నూహ్లో అక్రమ మైనింగ్ను అడ్డుకునేందుకు వెళ్లిన ఓ డీఎస్పీ ర్యాంక్ అధికారిని మైనింగ్ మాఫియా హత్య చేసిన కొన్ని గంటల్లోనే మహిళా ఎస్సై హత్య జరగటం కలకలం సృష్టించింది. డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ హత్య కేసులో ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో నిందితుడు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
Haryana: హర్యానాలో దారుణం.. అక్రమ మైనింగ్ అడ్డుకోబోయిన డీఎస్పీని తొక్కించి చంపిన వైనం
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారాన్ని మంగళవారం ప్రకటించారు. దోషులను విడిచిపెట్టబోమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మైనింగ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో మైనింగ్ మాఫియాను నియంత్రిస్తామని, బాధ్యులను విడిచిపెట్టబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మైనింగ్ ప్రాంతాలకు సమీపంలో పోలీసు పోస్టులను ఏర్పాటు చేస్తామని, మైనింగ్ వాహనాల గమ్యం, వాటి సామగ్రిని కూడా స్థిరపరుస్తామని ఖట్టర్ చెప్పారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?