Jharkhand: భర్త కళ్లెదుటే భార్యపై సామూహిక అత్యాచారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
physically assaults young woman in Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భర్త కళ్లముందే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని పాలము జిల్లాలో జరిగింది. అత్తామామలతో గొడవ పెట్టుకుని.. తల్లిదండ్రుల ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆరుగురు వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే..ఈ అత్యాచార ఘటన సత్బర్వా పోలీస్ స్టేషన్ పరిదిలోని బకోరియా భలువాహీ వ్యాలీ సమీపంలో జరిగిందని జిల్లా ఎస్పీ చందన్ కుమార్ సిన్హా వెల్లడించారు. పాలము జిల్లా పటాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 22 ఏళ్ల యువతి తన అత్తామామలతో గొడవ పడి శనివారం కాలినడకన పక్కనే ఉన్న లతేహార్ జిల్లాలోని మానిక పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని తన తండ్రి ఇంటికి బయలుదేరింది.
Also Read
- Bangladesh: షేక్ హసీనాను అప్పగిస్తేనే భారత్ వస్తాడంట.. బంగ్లాదేశ్ ప్రధాని షరతు..
- CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
- Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
- Snake bite: కానిస్టేబుల్ను కాటేసిన పాము.. AI సాయంతో దక్కిన ప్రాణాలు..
Read Also: IT Firm Cheating Case: బోర్డు తిప్పేసిన కంపెనీ.. ఉద్యోగాల పేరుతో భారీ మోసం
భార్య కోసం భర్త మరో బంధువుతో కలిసి మోటర్ సైకిల్ పై వెతకడం ప్రారంభించారు. ఆమెను రాత్రి 8 గంటల సమయంలో సత్బర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 39పై నడుచుకుంటూ వెళ్తున్న విషయాన్ని గుర్తించిన భర్త.. ఆమెను బుజ్జగించి ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే ఆ సమయంలో బైకులపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు భర్తను, అతని బంధువును తీవ్రంగా కొట్టి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భర్త కళ్లెదుటే ఆరుగురు వ్యక్తులు భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆరుగురు నిందితుల్లో ఇద్దరు వ్యక్తులను బాధితురాలి భర్త గుర్తించాడు.
ఈ ఘటన తర్వాత బాధితురాలిని నిందితులు వేరే ప్రాంతానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో బాధిత యువతి గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో గ్రామస్తులు వచ్చిన యువతిని రక్షించారు. ఇద్దరు నిందితులను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ఆరుగురి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మేదినీనగర్ మెడికల్ కాలేజీలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని.. సత్బర్వా పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ రిషికేస్ కుమార్ రాయ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Yash Struggle Story: పాన్ ఇండియా స్టార్ యశ్కి ఇలాంటి గతమా? థియేటర్లో ఆయన చేసిన పనులు తెలిస్తే షాకవుతారు!
-
Bangladesh: షేక్ హసీనాను అప్పగిస్తేనే భారత్ వస్తాడంట.. బంగ్లాదేశ్ ప్రధాని షరతు..
-
Mammootty: దారి తప్పిన స్టార్ హీరోకు సామాన్యుడి సాయం.. వైరల్ అవుతున్న మమ్ముట్టీ వీడియో!
-
Rocking Star Yash: యశ్ను పాన్ ఇండియా స్టార్ అంటూ ప్రశ్నించగా.. ఊహించని సమాధానం ఇచ్చిన రాకింగ్ స్టార్!
-
CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?