HD Kumaraswamy: బీజేపీ పాదయాత్రకు మద్దతివ్వని కుమారస్వామి.. ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల కేసు కారణం..
- కర్ణాటకలో బీజేడీ..జేడీఎస్ మధ్య విభేదాలు..
- పాదయాత్రకు మద్దతు ఇవ్వని కుమారస్వామి..
HD Kumaraswamy: కర్ణాటకలో బీజేపీ, మిత్రపక్షం జేడీఎస్ మధ్య విభేదాలు చెలరేగాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణికి సంబంధించి మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ బెంగళూర్ నుంచి మైసూర్ వరకు పాదయాత్ర పిలుపునిచ్చింది. అయితే, ఈ పాదయాత్రకు బీజేపీకి కుమారస్వామి పార్టీ మద్దతు ఇవ్వడం లేదు. పాదయాత్రలో జేడీఎస్ని ఎప్పుడూ పట్టించుకోలేదని ఆయన బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని విశ్వాసంలోకి తీసుకోనప్పుడు మేము ఎందుకు మద్దతు ఇవ్వాలి..? అని ఆయన విలేకరులతో అన్నారు.
Read Also: Ismail Haniyeh: హమాస్ చీఫ్ హనియే హత్యపై తీవ్రంగా స్పందించిన ఇరాన్..
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులోనూ మమతా బెనర్జీకి బిగ్ షాక్.. కౌంటింగ్ పిటిషన్ తిరస్కరణ
- New LPG Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. ఈ పని చేయకపోతే కనెక్షన్ కట్..!
- Tejasvi Surya: రూ.600 కోట్లతో మైనార్టీల కాలనీల్లో రోడ్లా? కర్ణాటక ప్రభుత్వంపై తేజస్వి సూర్య ధ్వజం
- Nitin Gadkari: "కులం గురించి మాట్లాడితే తన్నులు పడతాయ్".. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు!
తన అన్న కొడుకు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల వ్యవహారం హసన్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారం వెలుగులోకి రావడానికి బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రీతం గౌడ కారణమంటూ ఆ సమయంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ పాదయాత్రకు హసన్ జిల్లా నుంచి నేతృత్వం వహించేందుకు ప్రీతం గౌడను బీజేపీ ఎంపిక చేయడంపై జేడీఎస్ అసంతృప్తిగా ఉంది. అతడిని ఎంపిక చేయడంపై తాను బాధపడ్డానని కుమారస్వామి అన్నారు. ప్రీతం గౌడ దేవెగౌడ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాడు, పాదయాత్రపై చర్చించే సమావేశంలో అతడిని పక్కన కూర్చోబెట్టుకోవడం నాకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. హసన్లో ఏం జరిగిందో బీజేపీకి ఏమైనా తెలుసా..? అంటూ కుమారస్వామి ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి సతీమణి పార్వతితో సహా భూములు కోల్పోయిన వారికి మోసపూరితంగా స్థలాలు కేటాయించిన ముడా కుంభకోణానికి వ్యతిరేకంగా ఆగస్టు 3 నుంచి 10వ తేదీ వరకు బెంగళూరు నుంచి మైసూరు వరకు పాదయాత్ర నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ కుంభకోణంలో సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే, భారీ వర్షాల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పాదయాత్రను నిర్వహించేందుకు ఇది సరైన సమయం కాదని అన్నారు.
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీంకోర్టులోనూ మమతా బెనర్జీకి బిగ్ షాక్.. కౌంటింగ్ పిటిషన్ తిరస్కరణ
-
Thandai Masala Recipe: వేసవికి చల్లని ఔషధం.. ఇంట్లోనే క్షణాల్లో తండై మసాలా తయారు చేసుకోండి..!
-
Kyle Jamieson IPL Penalty: బిగ్ వార్నింగ్.. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన బౌలర్కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..
-
Axar Patel: ఎందుకు అతడిని లెజెండ్ అంటారో ఇప్పుడు అర్థమైంది.. ఆ ఆనందమే వేరప్ప!
-
Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!