HD Kumaraswamy: బీజేపీ పాదయాత్రకు మద్దతివ్వని కుమారస్వామి.. ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల కేసు కారణం..
- కర్ణాటకలో బీజేడీ..జేడీఎస్ మధ్య విభేదాలు..
- పాదయాత్రకు మద్దతు ఇవ్వని కుమారస్వామి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HD Kumaraswamy: కర్ణాటకలో బీజేపీ, మిత్రపక్షం జేడీఎస్ మధ్య విభేదాలు చెలరేగాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణికి సంబంధించి మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ బెంగళూర్ నుంచి మైసూర్ వరకు పాదయాత్ర పిలుపునిచ్చింది. అయితే, ఈ పాదయాత్రకు బీజేపీకి కుమారస్వామి పార్టీ మద్దతు ఇవ్వడం లేదు. పాదయాత్రలో జేడీఎస్ని ఎప్పుడూ పట్టించుకోలేదని ఆయన బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని విశ్వాసంలోకి తీసుకోనప్పుడు మేము ఎందుకు మద్దతు ఇవ్వాలి..? అని ఆయన విలేకరులతో అన్నారు.
Read Also: Ismail Haniyeh: హమాస్ చీఫ్ హనియే హత్యపై తీవ్రంగా స్పందించిన ఇరాన్..
Also Read
- Padma Awards 2026: ధర్మేంద్రకు పద్మ విభూషణ్.. అవార్డు స్వీకరించిన హేమా మాలిని, కన్నీళ్లు పెట్టుకున్న కుమార్తె అహానా
- Ropeway Stops Mid-Air: గాలిలో ఉండగానే అకస్మాత్తుగా ఆగిపోయిన రోప్వే.. చిక్కుకుపోయిన వందలాది మంది పర్యాటకులు
- Tamil Nadu: అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరిక
- Howrah Police: నేరస్థుల గుండెల్లో సువేందు సర్కార్ రైళ్లు.. పేరుమోసిన నేరస్థుడిని లోదుస్తుల్లో తీసుకెళ్లిన హౌరా పోలీసులు
తన అన్న కొడుకు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల వ్యవహారం హసన్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారం వెలుగులోకి రావడానికి బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రీతం గౌడ కారణమంటూ ఆ సమయంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ పాదయాత్రకు హసన్ జిల్లా నుంచి నేతృత్వం వహించేందుకు ప్రీతం గౌడను బీజేపీ ఎంపిక చేయడంపై జేడీఎస్ అసంతృప్తిగా ఉంది. అతడిని ఎంపిక చేయడంపై తాను బాధపడ్డానని కుమారస్వామి అన్నారు. ప్రీతం గౌడ దేవెగౌడ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాడు, పాదయాత్రపై చర్చించే సమావేశంలో అతడిని పక్కన కూర్చోబెట్టుకోవడం నాకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. హసన్లో ఏం జరిగిందో బీజేపీకి ఏమైనా తెలుసా..? అంటూ కుమారస్వామి ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి సతీమణి పార్వతితో సహా భూములు కోల్పోయిన వారికి మోసపూరితంగా స్థలాలు కేటాయించిన ముడా కుంభకోణానికి వ్యతిరేకంగా ఆగస్టు 3 నుంచి 10వ తేదీ వరకు బెంగళూరు నుంచి మైసూరు వరకు పాదయాత్ర నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ కుంభకోణంలో సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే, భారీ వర్షాల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పాదయాత్రను నిర్వహించేందుకు ఇది సరైన సమయం కాదని అన్నారు.
తాజావార్తలు
-
Ram Charan: శివన్నతో యాక్ట్ చేయడం నా జన్మ ధన్యం.. రెండూన్నరేళ్ల కష్టానికి ఫలితం ‘పెద్ది’ : రామ్ చరణ్
-
Tollywood : నందమూరి బాలకృష్ణకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అభినందనలు
-
Padma Awards 2026: ధర్మేంద్రకు పద్మ విభూషణ్.. అవార్డు స్వీకరించిన హేమా మాలిని, కన్నీళ్లు పెట్టుకున్న కుమార్తె అహానా
-
Ropeway Stops Mid-Air: గాలిలో ఉండగానే అకస్మాత్తుగా ఆగిపోయిన రోప్వే.. చిక్కుకుపోయిన వందలాది మంది పర్యాటకులు
-
Shiva Rajkumar: రామ్చరణ్కు నేషనల్ అవార్డ్ పక్కా.. ‘పెద్ది’పై కన్నడ సూపర్ స్టార్ శివన్న సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?