Japanese Encephalitis: అస్సాంలో బ్రెయిన్ ఫీవర్ కల్లోలం.. 47కు చేరిన మరణాల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JAPANESE ENCEPHALITIS IN ASSAM: అస్సాం రాష్ట్రాన్ని వరసగా విపత్తులను ఎదుర్కొంటోంది. గతంలో వరదల కారణంగా అస్సాం అతలాకుతలం అయింది. ప్రస్తుతం రాష్ట్రాన్ని జపనీస్ ఎన్సెఫాలిటిస్(బ్రెయిన్ ఫీవర్) కలవరపెడుతోంది. అస్సాంలో ఈ వ్యాధితో బాధపడుతూ చాలా మంది మరణిస్తున్నారు. వందల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా శుక్రవారం మరో ముగ్గురు ఈ వ్యాధి కారణంగా మరణించారు. ఇప్పటి వరకు మొత్తం 47 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 294 కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం కొత్తగా మరో 7 కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసుల్లో రెండు కేసులు జోర్హాట్ జిల్లాలో నమోదయ్యాయి, బొంగైగావ్, చరైడియో, దర్రాంగ్, దిబ్రూగర్, కోక్రాజార్ జిల్లాలలో ఒక్కొక్కటి నమోదు అయ్యాయి.
అస్సాంలోని 35 జిల్లాల్లోని 32 జిల్లాల్లో జపనీస్ ఎన్సెఫాలిస్ వ్యాధి బారిన పడ్డాయి. ఆయా జిల్లాల్లో ఇప్పటికే వ్యాధి వెలుగులోకి వచ్చింది. డిమా హసావో, కర్బీ అంగ్లాంగ్, దక్షిణ సల్మారా జిల్లాలు మాత్రమే వ్యాధిబారిన పడలేదు. నాగావ్ జిల్లాలో అత్యధికంగా 44 కేసులు, జోర్హాట్ జిల్లాలో 39 కేసులు, గోలాఘాట్ జిల్లాలో 34 కేసులు నమోదు అయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అస్సాంలోని మొత్తం తొమ్మిది వైద్య కళాశాల్లలో, 10 జిల్లా ఆసుపత్రుల్లో ఐసీయూ, టెస్టింగ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
Read Also: Monkeypox: యూరప్ రకానికి భిన్నంగా ఇండియా మంకీపాక్స్ వైరస్
వైరస్ వల్ల వచ్చే ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం పొంచి ఉంటుంది. సాధారణ జ్వరంగా ప్రారంభం అయ్యే జపనీస్ ఎన్సెఫాలిస్.. తరువాత మెదడు, వెన్నుపాముపై ప్రభావం చూపిస్తుంది. తీవ్ర జ్వరంతో పాటు పక్షవాతం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దోమ కాటు వలన వ్యాధికారక వైరస్ మానవుడి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. మేలో ప్రారంభమై అక్టోబర్ వరకు తన ప్రభావాన్ని చూపిస్తుంది. అస్సాంలో ప్రతీ ఏడాది వర్షాకాలంలో వైరల్ జ్వరాలు, మలేరియాలో చాలా మంది మరణిస్తున్నారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!