Jammu Kashmir: కాశ్మీర్ లోయలో ఎన్ కౌంటర్.. ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Two terrorists killed in Shopian encounter in jammu kashmir: జమ్మూకాశ్మీర్ లో భద్రతాబలగాలు మరోసారి పైచేయి సాధించాయి. ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. జమ్మూ కాశ్మీర్ లో గత కొంత కాలంగా ఉగ్రవాదులు ఏదైనా దాడికి పాల్పడాలని ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు స్థానికులు, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. కానీ ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల ప్లాన్స్ ను భగ్నం చేస్తున్నాయి భద్రతా బలగాలు. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి భద్రతా బలగాలు.
తాజాగా దక్షిణ కాశ్మీర్ లోని షోఫియాన్ జిల్లాలోని నాగ్ బాల్ ప్రాంతంలో మంగళవారం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. నిషేధిత లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు హతమార్చాయి. నాగ్ బాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు అక్కడ కార్డర్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను మట్టుపెట్టాయి భద్రతాబలగాలు.
Also Read
- Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
- Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
Read Also: Babri Masjid Demolition Case: బాబ్రీ కేసులో అన్ని ధిక్కార పిటిషన్లను క్లోజ్ చేసిన సుప్రీంకోర్టు
ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు తీసుకుంటున్న చర్యలతో ఉగ్రవాదులు తగ్గుముఖం పట్టాయి. అయితే స్థానికేతరులు, సాధారణ పౌరులు లక్ష్యంగా చేసుకుంటూ టార్గెటెడ్ కిల్లింగ్స్ కు పాల్పడుతున్నారు. కాశ్మీర్ పండిట్లు, హిందువులు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెంట్ ఫ్రంట్ హైబ్రీడ్ దాడులకు పాల్పడుతోంది. గతంలో కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్ హత్యతో పాటు టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్, హిందూ మహిళా ఉపాధ్యాయురాలిని, స్థానికేతరుడైన బ్యాంక్ మేనేజర్ తో పాటు బీహార్ నుంచి వచ్చిన వలస కూలీలను కాల్చి చంపారు. అయితే ఈ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను కొన్ని రోజుల వ్యవధిలోనే భద్రతా బలగాలు మట్టుపెట్టాయి.
తాజావార్తలు
-
TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
-
Romantic Movie OTT: థియేటర్లలో దేకలే… ఓటీటీలో మాత్రం ఊపేస్తున్న తెలుగు రొమాంటిక్ మూవీ
-
Peddi Breakeven Target : రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
-
Job News: ఏడాదికి రూ.55 లక్షల భారీ ప్యాకేజీ.. నోటిఫికేషన్ ఔట్.. ఇలా అప్లై చేసుకోండి!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!