Jammu Kashmir : జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా?
- ఆరేళ్ల తర్వాత తెరపైకి జమ్మూ కు ప్రత్యేక రాష్ట్ర హోదా
- 2019 ఆగస్ట్ 5 న ఆర్టికల్ 370 ని రద్దు చేసిన మోడీ సర్కార్
- 370 రద్దుతో స్పెషల్ స్టేటస్ కోల్పోయిన జమ్మూ కశ్మీర్
- స్పెషల్ స్టేటస్ రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు చేసిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir : ఢిల్లీ – జమ్మూ కశ్మీర్ కు మళ్ళీ ప్రత్యేక రాష్ట్ర హోదా రానుందా.. ఆరేళ్ల తర్వాత తెరపైకి ఎందుకు స్పెషల్ స్టేటస్ పై ఈ చర్చ మొదలైందో తెలుసా.. ఆగస్టు 5 , 2019 న జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను కోల్పోయింది.. ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసింది కేంద్రం.. అంతేకాదు జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసింది..
జమ్ము కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్ర హోదాను కోల్పోయి సరిగ్గా ఆరేళ్లు.. అయితే గతేడాదే జమ్ము కాశ్మీర్లో ఎన్నికల నిర్వహించింది ఈ సి.. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో కలిసి పోటీ చేసి అధికారాన్ని దక్కించుకున్నాయి.. ఒమర్ అబ్దుల్లా మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే అబ్దుల్లా ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలనే అంశంపై డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.. 2023 డిసెంబర్లో సుప్రీంకోర్టు సైతం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్ర హోదా రద్దు పై కీలకతీర్పునిచ్చింది.. ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టు సమర్ధించింది. అయితే వీలైనంత త్వరగా జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు.. ఇప్పటివరకు అటువంటి ప్రయత్నాలు ఏమి కనిపించలేదు..
Also Read
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
కానీ 370 ఆర్టికల్ రద్దయిన ఆగస్టు 5 రావడానికి రెండు రోజుల ముందు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లు వేర్వేరుగా సమావేశమయ్యారు.. ఎన్నో కీలక అంశాలపై చర్చించారు.. అయితే సమావేశంలోని చర్చలపై అధికారికంగా ఎటువంటి ప్రకటన లేకపోయినప్పటికీ, 5 ఆగస్ట్ దగ్గర కావడంతో , జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చర్చ మొదలైంది.
Uttam Kumar Reddy : ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లే కాళేశ్వరంపై కమిషన్ వేశాం
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!