Jammu Kashmir : జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా?
- ఆరేళ్ల తర్వాత తెరపైకి జమ్మూ కు ప్రత్యేక రాష్ట్ర హోదా
- 2019 ఆగస్ట్ 5 న ఆర్టికల్ 370 ని రద్దు చేసిన మోడీ సర్కార్
- 370 రద్దుతో స్పెషల్ స్టేటస్ కోల్పోయిన జమ్మూ కశ్మీర్
- స్పెషల్ స్టేటస్ రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు చేసిన కేంద్రం
Jammu Kashmir : ఢిల్లీ – జమ్మూ కశ్మీర్ కు మళ్ళీ ప్రత్యేక రాష్ట్ర హోదా రానుందా.. ఆరేళ్ల తర్వాత తెరపైకి ఎందుకు స్పెషల్ స్టేటస్ పై ఈ చర్చ మొదలైందో తెలుసా.. ఆగస్టు 5 , 2019 న జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను కోల్పోయింది.. ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసింది కేంద్రం.. అంతేకాదు జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసింది..
జమ్ము కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్ర హోదాను కోల్పోయి సరిగ్గా ఆరేళ్లు.. అయితే గతేడాదే జమ్ము కాశ్మీర్లో ఎన్నికల నిర్వహించింది ఈ సి.. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో కలిసి పోటీ చేసి అధికారాన్ని దక్కించుకున్నాయి.. ఒమర్ అబ్దుల్లా మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే అబ్దుల్లా ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలనే అంశంపై డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.. 2023 డిసెంబర్లో సుప్రీంకోర్టు సైతం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్ర హోదా రద్దు పై కీలకతీర్పునిచ్చింది.. ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టు సమర్ధించింది. అయితే వీలైనంత త్వరగా జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు.. ఇప్పటివరకు అటువంటి ప్రయత్నాలు ఏమి కనిపించలేదు..
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
కానీ 370 ఆర్టికల్ రద్దయిన ఆగస్టు 5 రావడానికి రెండు రోజుల ముందు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లు వేర్వేరుగా సమావేశమయ్యారు.. ఎన్నో కీలక అంశాలపై చర్చించారు.. అయితే సమావేశంలోని చర్చలపై అధికారికంగా ఎటువంటి ప్రకటన లేకపోయినప్పటికీ, 5 ఆగస్ట్ దగ్గర కావడంతో , జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చర్చ మొదలైంది.
Uttam Kumar Reddy : ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లే కాళేశ్వరంపై కమిషన్ వేశాం
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!