Jammu Kashmir: కాశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్.. లష్కర్ ఉగ్రవాది హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lashkar Terrorist Killed In Encounter In Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్ లో కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఉగ్రవాదులు మరోసారి పెట్రేగే ప్రణాళికల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. దీంతో కాశ్మీర్ లో వరసగా ఎన్కౌంటర్లో జరుగుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో రెండు ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ రెండు ఎన్కౌంటర్లు కూడా కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోనే చోటు చేసుకున్నాయి. శనివారం సాయంత్రం బారాముల్లాలోని బిన్నెర్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ ప్రారంభం అయింది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన కాశ్మీర్ పోలీసులు, సీఆర్ఫీఎఫ్ బలగాలు జాయింట్ గా ఈ ఎన్ కౌంటర్ ను నిర్వహించాయి. ఈ ఎన్కౌంటర్లో లో లష్కరే తోయిబా ఉగ్రవాది ఒకరు హతమయ్యాడని పోలీసులు వెల్లడించారు. భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ ప్రారంభిస్తున్న సమయంలో ఉగ్రవాదులు ఇది గమనించి కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. హతమైన ఉగ్రవాదిని బారాముల్లా జిల్లా పట్టాన్ కు చెందిన ఇర్షాద్ అహ్మద్ భట్ గా గుర్తించారు. ఇతడు మే, 2022 నుంచి ఉగ్రవాద కార్యకలాపాల్లో యాక్టివ్ గా ఉన్నాడు. ఘటనాస్థలం నుంచి ఒక ఏకే రైఫిల్ తో పాటు 2 మ్యాగజైన్స్, స్వాధీనం చేసుకున్నారు.

Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
Read Also: CM Stalin: ఒక దేశం-ఒకే భాష నినాదంపై తమిళనాడు సీఎం సీరియస్
అంతకుముందు శనివారం ఉదయం బారాముల్లా జిల్లాలోని వనిగామ్ గ్రామంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది మరణించగా.. ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ ఎన్కౌంటర్లో స్నిఫర్ డాగ్ ఆలెక్స్ కూడా మరణించింది. ఎన్కౌంటర్ జరుగుతున్న సమయంలో బాడీ కామ్ ధరించిన రెండు స్నిఫర్ డాగ్ లను లోపలికి పంపారు. ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఒక స్నిపర్ డాగ్ మరణించింది. వనిగామ్ గ్రామంలో ఒక పాకిస్తాన్ ఉగ్రవాదితో పాటు ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో పోలీసులు, ఆర్మీ జాయింట్ ఆపరేషన్ ప్రారంభించాయి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!